కోతలే ఎక్కువ..!
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రసవం తరువాత కేసీఆర్ కిట్ల పంపిణీతో పాటు అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల చొప్పున లబ్ధిదారులకు అందిస్తుంది.
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రసవం తరువాత కేసీఆర్ కిట్ల పంపిణీతో పాటు అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల చొప్పున లబ్ధిదారులకు అందిస్తుంది. దీంతో పాటు ఈ నెల 14 నుంచి గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్లను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తూ ఉన్నారు. అక్కడకు వెళ్లిన గర్భిణులకు శస్త్ర చికిత్సలే అధికంగా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంతో పాటు, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, నకిరేకల్ ఏరియా ఆసుత్రులతో పాటు 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవాల్లో గత మూడు నెలల క్రితం 18వ స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం 10వ స్థానానికి పెరిగింది. గ్రామ, పట్టణ స్థాయిల్లో ఆశాలు, ఏఎన్ఎంలు గర్భిణులకు సూచనలు చేస్తున్నా.. కొంత మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ప్రైవేటుకు వెళ్తున్న వారికి 90 శాతం వరకు శస్త్రచికిత్సలే జరుగుతున్నాయి. ముందుగానే రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ప్యాకేజీలు మాట్లాడుకొని శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు, కింది స్థాయి సిబ్బంది కమీషన్ల కోసం బాధితులను ప్రైవేటుకు పంపుతున్నారనే విమర్శలున్నాయి.
అవగాహన పెంచుతున్నాం
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాం.గర్భిణులుగా పేరు నమోదు చేసుకున్న సమయం నుంచి అన్నిరకాలుగా వారికి సేవలు అందిస్తున్నాం. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నాం. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సుల కొరత ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ చేయాడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రైవేటులో శస్త్రచికిత్సలు తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాసుపత్రి నుంచి బాధితులను ప్రైవేటుకు పంపేవారి సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
అన్నిమల్ల కొండల్రావు,డీఎంహెచ్వో, నల్గొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్