ప్రాణం తీసిన అతివేగం
రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా.. ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రమాదానికి గురైన తెలుకుంట్ల నరేశ్ కుటుంబసభ్యులు
తిరుమలగిరి, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా.. ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లి గ్రామానికి చెందిన తెలుకుంట్ల నరేశ్ తిరుమలగిరిలో జరిగిన తమ బంధువుల శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. తొండ సమీపంలో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ వెనుక నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నరేశ్, అతని భార్య స్వరూప(30) మూడేళ్లలో వయస్సున్న కూతుళ్లు ఆద్య, అక్షితకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 వాహనంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ స్వరూప మృతిచెందారు. మిగతా ముగ్గురిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. మృతురాలి తండ్రి బొల్లోజు వీరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.శివకుమార్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణం
మేళ్లచెరువు, న్యూస్టుడే: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రేవూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై సురేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. రేవూరు గ్రామానికి చెందిన జూనెబోయిన నాగరాణి (23) వివాహం అదే గ్రామవాసి జూనెబోయిన లక్ష్మణ్తో ఆరేళ్ల కిందట జరిగింది. కొన్నాళ్ల తర్వాత భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. పెద్దల సమక్షంలోనూ పంచాయితీ చేశారు. అతనికి సర్దిచెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన రాత్రి కూడా భర్త వేధించాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు వెంకట శ్రీను నాగరాణిని పుట్టింటికి తీసుకెళ్లారు. రెండో తేదీ ఉదయం ఆమె అత్తగారింటికి వెళ్లింది. ఎలా ఉందోనని సోదరుడు వెంకట్ చెల్లిని పలకరించేందుకు సాయంత్రం అక్కడికెళ్లారు. ఇంట్లో చూసేసరికి ఉరి వేసుకుని నాగరాణి నిర్జీవంగా కన్పించింది. అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంటూ మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
[ 25-04-2024]
భువనగిరి ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ కలెక్టరేటులోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను సందర్శించారు. -
భువనగిరి లోక్సభ స్థానానికి 61 మంది నామినేషన్లు
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రికార్డ్ స్థాయిలో 61 మంది నామినేషన్లు వేశారు. -
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?