దళితబంధులో దళారుల చేతివాటం..!
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళారుల కారణంగా పక్కదారి పడుతోంది. ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లినా విచారణ పూర్తి స్థాయిలో జరగడం లేదు.
ఖాళీ బాండ్ పేపర్పై దళారులు తీసుకున్న సంతకాలను చూపుతున్న గుడిబండ దళితబంధు లబ్ధిదారులు
కోదాడ గ్రామీణం, న్యూస్టుడే: దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళారుల కారణంగా పక్కదారి పడుతోంది. ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లినా విచారణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీంతో ఫిర్యాదు చేసిన లబ్ధిదారులను స్థానిక నాయకుల అనుచరులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో దళితబంధు పథకంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పటి నుంచి నేటి వరకు స్థానిక నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని ఆశ్రయించారు.
యూనిట్కు రూ.2లక్షలు..! గుడిబండలో దళితబంధు పథకం కింద 100 యూనిట్లు మంజూరయ్యాయి. స్థానిక నేతల అనుచరులు ముందస్తుగా కొంతమంది నుంచి రూ.2లక్షల చొప్పున వసూలు చేశారు. మరికొంతమంది నుంచి రూ.లక్ష వసూలు చేసి మిగిలిన సొమ్మును యూనిట్ మంజూరయ్యాక ఇవ్వాల్సిందిగా దళారులు ఆదేశాలు జారీచేశారు. దీనికోసం రూ.100 ఖాళీ బాండ్ పేపర్లపై లబ్ధిదారుల నుంచి సంతకాలు సేకరించారు.
గేదెల పంపిణీలో గోల్మాల్..! పాల ఉత్పత్తులు నిర్వహించుకునేందుకు ఒక్కో యూనిట్కు రూ.7.40 లక్షల విలువైన 8 గేదెలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మిగిలిన సొమ్ము దాణా, వైద్య ఖర్చులకు, పశువుల బీమా కోసం లబ్ధిదారుని అకౌంట్లో నగదు జమ చేస్తుంది. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ.లక్ష నగదు చెల్లించబోమంటూ లబ్ధిదారులు తేల్చిచెప్పడంతో, దళారులు లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని యూనిట్కు నాలుగు గేదెలను లాగేసుకుంటున్నారు. గేదెలుఇవ్వని లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లనుంచి సమాచారం ఇవ్వకుండా నగదును డ్రా చేస్తున్నారు. అంతకు ముందు గొర్రెల పంపిణీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి.
ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు: శిరీష, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
దళితబంధు అవినీతిపై ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 100 శాతం దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం దళితబంధును ప్రవేశపెట్టింది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగానే జరిగింది.
సమాచారం లేకుండా రూ.60 వేలు డ్రా చేశారు
కొప్పుల పద్మ, బాధితురాలు
కూలీ పనులకు వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. నాకు దళితబంధు ఇప్పిస్తామని గ్రామంలోని ఓ వ్యక్తి ముందస్తుగా రూ.లక్ష తీసుకున్నారు. మిగిలిన సొమ్మును యూనిట్ వచ్చాక ఇవ్వాలని ఖాళీ బాండ్ పేపర్పై సంతకం తీసుకున్నారు. యూనిట్ మంజూరయ్యాక మిగిలిన నగదును ఆర్థిక పరిస్థితులు బాగాలేక అందించలేకపోయాను. దీంతో దళారులు నా యూనిట్లోని నాలుగు గేదెలు తీసుకెళ్లారు. దీంతో పాటు దాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందించిన రూ.60 వేల నగదును సమాచారం లేకుండా అకౌంట్ నుంచి డ్రా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్