అన్నదాతకు చేరువగా ఆయిల్పామ్
తక్కువ నీటి వనరులతో ఎక్కువ ఫలసాయం పొందేందుకు ప్రభుత్వం గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆయిల్పామ్ సాగు చేయించాలని సంకల్పించింది. ఇందుకు రాయితీలు ఇస్తూ సదరు రైతులను ప్రోత్సహించే పనికి పూనుకుంది.
సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు
రాజపేట, ఆలేరు, న్యూస్టుడే
ఆయిల్పామ్ మొక్కలను పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి
తక్కువ నీటి వనరులతో ఎక్కువ ఫలసాయం పొందేందుకు ప్రభుత్వం గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆయిల్పామ్ సాగు చేయించాలని సంకల్పించింది. ఇందుకు రాయితీలు ఇస్తూ సదరు రైతులను ప్రోత్సహించే పనికి పూనుకుంది. తొలి ఏడాది పంట సాగుపై రైతులు అంతగా మొగ్గు చూపకపోయినా ఈసారి భారీ లక్ష్యంతో అధికారులు ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నారు. సాగు విస్తీర్ణం పెంపు బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం గమనార్హం. రానున్న సీజన్లో 8700 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ప్రారంభించిన ఏడాది రైతులకు అవగాహన కల్పించడంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు ముందస్తు చర్యలకు పూనుకుంటున్నారు. ఆ క్రమంలోనే జిల్లాల వారీగా ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి కలిగిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రాథమికంగా చేపట్టిన సర్వే మేరకు జిల్లాలో 60 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మూడున్నర లక్షల మొక్కలు సిద్ధం
విడతల వారీగా జిల్లాల్లో సాగును విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏటా సాగు లక్ష్యాలను నిర్దేశించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. జూన్ నుంచి మార్చి వరకు మొక్కలు నాటేందుకు అవకాశం ఉండటంతో నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రైతులకు మొక్కలు అందించేందుకు జిల్లాకు ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు మండలం పాలడుగులో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే మూడున్నర లక్షల పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉండగా మరో మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతుల ఆసక్తిని బట్టి నర్సరీలో మొక్కలు సరిపోని పరిస్థితుల్లో సమీప జనగామ, సిద్దిపేట జిల్లాల నుంచి కూడా తెప్పించేందుకు సిద్ధపడుతున్నట్లు అధికారులంటున్నారు.
సమస్యలను అధిగమిస్తేనే ముందుకు
పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తేనే ఆశించిన లాభాలను గడించే అవకాశం ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తొలి ఏడాది సాగుచేసిన రైతులు పంటపొలాల్లోని మొక్కలను అడవిపందులు నాశనం చేశాయి. మరికొన్ని చోట్ల కొమ్ముముక్క పురుగు ఆశించి మొక్కలను నష్టపరిచాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏటా ప్రభుత్వం ఇచ్చే రాయితీని సకాలంలో రైతులకు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. తొలిఏడాది ఆయిల్పామ్ సాగుకు రాయితీని ప్రభుత్వం మంజూరు చేసినా రెండో ఏడాదికి చెందిన రాయితీ త్వరలో రైతుల ఖాతాలో పడనుందని అధికారులంటున్నారు. ఆయిల్పామ్ సాగుకు నాలుగు సంవత్సరాల రాయితీ ఉంటుంది. మొక్కల సరఫరా నుంచి మొదలు పంట విక్రయాల వరకు ఆయా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మొక్కలు సిద్ధంగా ఉన్నాయి
ఎ.ప్రవీణ్కుమార్, ఆయిల్ఫెడ్ జిల్లా కో- ఆర్డినేటర్
వచ్చే సీజన్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు ఆసక్తి చూపే రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. నెల వారీగా లక్ష్యం పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. సాగుపై అవగాహన పెరిగి రైతులు ఆయిల్పామ్ మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపుతున్నారు. మోత్కూరు మండలం పాలడుగులో మూడున్నర లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. రైతులు సద్వినియోగ పరచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి