ఆ చేపల పులుసు.. ఆహా..!
శాలిగౌరారం చేపలు రుచిలో అదుర్స్.. చేపల పులుసు, వేపుడు, పచ్చడి.. ఇలా వంటకం ఏదైనా..రుచిలో వీటిది ప్రత్యేకత. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది ఆ చేపలను.
జలాశయం వద్ద చేపలు పట్టే సీజన్లో ఇలా.. జాతరలా.(దాచిన చిత్రం)
నకిరేకల్, శాలిగౌరారం న్యూస్టుడే: శాలిగౌరారం చేపలు రుచిలో అదుర్స్.. చేపల పులుసు, వేపుడు, పచ్చడి.. ఇలా వంటకం ఏదైనా..రుచిలో వీటిది ప్రత్యేకత. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది ఆ చేపలను. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం ప్రాజెక్టు అంటే గుర్తొచ్చేవి చేపలే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8న ఊరూరా చెరువుల పండుగ. 8, 9, 10 తేదీల్లో మూడు జిల్లా కేంద్రాల్లో ‘చేపల ఆహార పండుగ’ (ఫిష్ ఫుడ్ పెస్టివల్)ను ప్రభుత్వం నిర్వహిసోంది.
వందల ఏళ్ల చరిత్ర..
మండు వేసవిలో నిండి, వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగునీరందించే శాలిగౌరారం ప్రాజెక్టును 1804లో నిజాం కాలంలో నిర్మించారు. ఇక్కడి మత్స్య సంపదకు కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఏడు గ్రామాల్లోని 10 వేల ఎకరాల వరకు ఆయకట్టుకు సాగునీరందిస్తోంది.
జలాశయంలో చేపలవేటలో మత్స్యకార్మికుడు
మత్స్య పారిశ్రామికుల సంఘం ఏర్పాటు..
ప్రాజెక్టులో చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జిల్లా మత్స్య శాఖ 1972లో మత్స్య పారిశ్రామికుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసింది. 30 మందితో ప్రారంభమైన ఈ సొసైటీ దినదినాభివృద్ది చెంది ప్రస్తుతం 709 మందికి చేరింది. చేపలను పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒక్కరోజు మత్య్స కార్మికుడు చేపటల వేటకు వెళ్లి రూ.300 నుంచి 600 పైగా సంపాదిస్తారు.
* చేపలు పెరిగే నీటితోపాటు చెరువు నేల స్వభావం, అందులో పెరిగే నాచు, నీటిలో పడే చెట్ల ఆకుల వంటివి చేపల రుచిని ప్రభావితం చేస్తుంటాయని మత్స్య సొసైటీ ప్రతినిధులు, మత్స్య వ్యాపారులు చెబుతున్నారు.
రుచులు పంచుతూ..
ప్రాజెక్టు వద్ద వేడివేడి చేపల కూర ఇలా. సిద్ధం
ప్రాజెక్టులో చేపలు పట్టినప్పుడు ఒక్కో చేప సుమారు 4 నుంచి 20 కిలోల వరకు బరువు ఉంటుంది. చేపలు పడుతున్నారంటే చాలు నల్గొండ, హైదరాబాద్, సూర్యాపేట, అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూరు నుంచి చేపల ప్రేమికులు తరలివస్తారు. చిన్న, పెద్ద వ్యాపారులతో ప్రాజెక్టు ప్రాంతం జాతర వాతావరణాన్ని సంతరించుకుంటుంది. గౌరారం చేపలకు కోల్కతాలో డిమాండ్ అధికం. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడి రవ్వ, బొచ్చ, కొర్రమీను, వాలుగ వంటి పలు రకాల చేపలను వ్యాపారులు కోల్కతాకే ఎగుమతి చేస్తున్నారు. ఏటా 50 టన్నులకు పైగా చేపలు అక్కడికి వెళ్తుంటాయి. హైదరాబాదు, రాజమహేంద్రవరం, విజయవాడకు శాలిగౌరారం చేపలు ఎగుమతవుతుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.