మండుటెండల్లో.. నిండుకుండల్లా..!
మండుటెండలు, వడగాలుల ప్రభావంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో కొన్ని దృశ్యాలు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.
జలకళను సంతరించుకున్న మేళ్లచెరువు నాగుల చెరువు
హుజూర్నగర్, మేళ్లచెరువు, న్యూస్టుడే: మండుటెండలు, వడగాలుల ప్రభావంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో కొన్ని దృశ్యాలు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్న చెరువులే ఇందుకు కారణం. మండుటెండల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ఈ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు ఈ కళ వచ్చింది. ఈ పథకం ద్వారా చెరువుల్లో తవ్విన పూడిక మట్టి కంటే రైతులే స్వయంగా తోడుకున్న మట్టి నాలుగింతలై పంట పొలాలకు తరలింది. నేడు ఆ ఫలాలు చెరువుల్లో కనిపిస్తున్నాయి.
చెరువుల్లో జలకళ..
గతంలో వేసవి సమీపిస్తుంటేనే చెరువులు అడుగంటిపోయేవి. చుక్కనీరు లేక అడుగు నెర్రెలు బారేది. ఇప్పుడు అవే చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మేళ్లచెరువులోని నాగుల చెరువే ఇందుకు సాక్ష్యం. ఇలాంటి చెరువులు సాగర్ ఆయకట్టులోని హుజూర్నగర్, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో దర్శనమిస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంత భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. గ్రామాల్లో మునుపటి నీటి ఎద్దడి లేదు. నల్లాల వద్ద బారులు తీరిన బిందెలూ లేవు. మిషన్ భగీరథ పథకంతో నీటి బెంగలేదు.
తగ్గని భూగర్భ జలం..
మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పూడిక మట్టి తొలగింపు ప్రక్రియ సానుకూల ఫలితాలనిచ్చింది. గతంలో సాగర్ నీటితో చెరువులు నింపినా నెలరోజుల్లోనే ఇంకిపోయేవి. మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల్లో మాత్రం మండు వేసవిలోనూ నీరు తగ్గలేదు. సాగర్ నీటిని వదిలినా చెరువులకు ప్రత్యేకంగా మలిపేంత అవసరం రాలేదు. దీనికి అకాల వానలు కలిసొచ్చాయని చెప్పొచ్చు. మేళ్లచెరువులో భూగర్భ జలం గతంలో 150 అడుగుల లోతుకు పడిపోయింది. ప్రస్తుతం వంద అడుగుల్లోపే నీరు ఉంది. నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమవడం లేదు. చెరువు పూడిక తీత పనులు జరిగిన మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ నీటిమట్టం పెరుగుదల ఉమ్మడి జిల్లాలో 7.77 మీటర్లలో ఉందని అధికారులు చెబుతున్నారు.
చెరువులకు పూర్వపు సామర్థ్యం వచ్చింది
స్వామి, డీఈ, నీటిపారుదలశాఖ, హుజూర్నగర్
మిషన్ కాకతీయ వల్ల చెరువులకు దశాబ్దాలుగా పూడిపోయిన పూడిక తీశారు. దీనివల్ల చెరువులకు పూర్వపు నీటి నిల్వ సామర్థ్యం వచ్చింది. నాలుగు దశల్లో ఆయా జిల్లాల్లోని చెరువులన్నిటిలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. దీనివల్లే మండే ఎండల్లోనూ చెరువులు నిండు కుండల్లా మారాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..