యాదాద్రిలో ఆధ్యాత్మిక పర్వాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం ఆధ్యాత్మిక పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.
సాయంత్రం అలంకార సేవోత్సవం చేపడుతున్న దృశ్యం
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం ఆధ్యాత్మిక పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తూ హారతిని నివేదించిన పూజారులు ఉత్సవమూర్తులను పాలతో అభిషేకించారు. వేదమంత్రాల మధ్య తులసీ అర్చన జరిగింది. నిత్యకార్యక్రమాల్లో భాగంగా మండపంలో శ్రీ లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. పూజారులు మంత్రోచ్చరణలతో జరిపిన కల్యాణోత్సవంలో గజవాహనోత్సవాన్ని చేపట్టారు. పలువురు భక్తులు కల్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్ర సందర్శనకై వచ్చిన పలువురు భక్తులు సాయంత్రం జరిగిన అలంకార సేవోత్సవంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. రాత్రి ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. శివాలయంలో రామలింగేశ్వరుడిని ఆరాధిస్తూ నిత్యపూజలు కొనసాగాయి. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నిత్యారాధనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభావంతో క్షేత్రానికి భక్తులు తగ్గారు. దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ.11,65,964 లు నిత్యాదాయంగా ఈవో గీతారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 08-12-2023]
దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు