8 నెలలు.. 1253 మంది కుక్కకాటు బాధితులు
నేరేడుచర్లలో ఇద్దరు మహిళలపై గతవారం పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికంగా శునకాల సంతతి నియంత్రణ శస్త్రచికిత్స కేంద్రాలు లేకపోవడంతో వాటి సంతతి పెరిగి దాడులు చేస్తున్నాయి
వాడవాడలో శునకాల స్వైరవిహారం
కానరాని నియంత్రణ చర్యలు
సూర్యాపేటలో రాత్రి సమయంలో కుక్కల సంచారం
* నేరేడుచర్లలో ఇద్దరు మహిళలపై గతవారం పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికంగా శునకాల సంతతి నియంత్రణ శస్త్రచికిత్స కేంద్రాలు లేకపోవడంతో వాటి సంతతి పెరిగి దాడులు చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లి క్షేమంగా చేరుకునే పరిస్థితి లేదు. ఎక్కడైనా కుక్కల దాడి జరిగితే అధికారులు హడావుడి చేస్తూ.. ఆ తర్వాత మిన్నకుంటున్నారు.
సూర్యాపేట పురపాలిక, నేరేడుచర్ల, న్యూస్టుడే: జిల్లాలో రోజురోజుకూ శునకాల బెడద అధికమవుతోంది. ఎక్కడో ఒకచోట రోజుకొకరు వాటి వల్ల గాయపడుతూనే ఉన్నారు. కానీ, కుక్కల ఆగడాల నియంత్రణకు అడుగులు పడటం లేదు. ప్రతి పురపాలికలో శునకాల సంతతి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్ల పురపాలికల్లో నేటికీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మిగతా నాలుగు మున్సిపాలిటీల నుంచి ప్రత్యేకంగా వాహనంలో సూర్యాపేటకు కుక్కలను తీసుకొచ్చి చికిత్స చేయించి తీసుకెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి సంతతి తగ్గడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో 1253 మంది కుక్కకాటు బారిన పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
దూరభారంతో ఇబ్బందులు
కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల పురపాలికకు సూర్యాపేటకు మధ్య దూరం సుమారు 35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది వాహనంలో కుక్కలను తీసుకువచ్చేందుకు దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శనకానికి సంతతి నియంత్రణ శస్త్రచికిత్స చేయాలంటే సుమారు రూ.1600 వరకు వ్యయమవుతుంది. వాటితోపాటు డీజిల్ ఖర్చు భరించాల్సి ఉంటుంది. నెలకు మూడు, నాలుగు సార్లు సూర్యాపేటకు వస్తుండటంతో పురపాలికలకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ మొత్తాన్ని భరించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో శునకాల సంతతి పెరిగి ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు శునకాల ఆగడాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
- శ్రీనివాస్రెడ్డి,మున్సిపల్ కమిషనర్, నేరేడుచర్ల
కుక్కల సంతతి నియంత్రణ శస్త్ర చికిత్స కేంద్రాల ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి నుంచి ఆదేశాలు రాగానే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం శునకాల శస్త్ర చికిత్సల నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
-
Extra Ordinary Man Movie Review: రివ్యూ: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. కామెడీ ఎంటర్టైనర్తో నితిన్ హిట్ అందుకున్నారా..?
-
సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్రావు