సొంత ఊరిపై మమకారం..రూ.2 కోట్లతో పాఠశాల భవన నిర్మాణం
ధనార్జనే ముఖ్యం కాదు.. సొంత గ్రామం అభివృద్ధి లక్ష్యంగా భావించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో అరకొర వసతులతో విద్యార్థులు పడుతున్న అవస్థలు గుర్తించి పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారు సుమధుర ఫౌండేషన్ ఛైర్మన్ గుండా మధుసూదన్
22న ప్రారంభించనున్న మంత్రి జగదీశ్రెడ్డి
ఇస్కిల్లలో సుమధుర ఫౌండేషన్ సంస్థ నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం
రామన్నపేట, న్యూస్టుడే: ధనార్జనే ముఖ్యం కాదు.. సొంత గ్రామం అభివృద్ధి లక్ష్యంగా భావించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో అరకొర వసతులతో విద్యార్థులు పడుతున్న అవస్థలు గుర్తించి పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారు సుమధుర ఫౌండేషన్ ఛైర్మన్ గుండా మధుసూదన్. ఈయన స్వగ్రామమైన రామన్నపేట మండలం ఇస్కిల్లలో సొంతంగా రూ.2కోట్లుతో కార్పొరేట్ తరహా అధునాతన వసతులతో గుండా సత్తయ్య మెమోరియల్ పేరిట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనాన్ని ఈ నెల 22న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించనున్నారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అనే నినాదంతో గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మధుసూదన్. ఉన్నత విద్య కోసం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. యువత అభ్యున్నతి కోసం యూట్యూబ్, బేసిక్ కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. పాఠశాలలో సదుపాయాలు సక్రమంగా లేకపోవటంతో నూతన భవన నిర్మాణాన్ని గత సంవత్సరం డిసెంబరులో ప్రారంభించి పూర్తిచేశారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 14గదులు నిర్మించారు. విశాలమైన తరగతి గదులతో పాటు కంప్యూటర్్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, వంట గది, భోజన శాల, రెండు అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు, వంట గదులు, రూ.3 లక్షలతో డిజిటల్ తరగతి గది, క్రీడా సామగ్రి, గ్రంథాలయంలో రూ.50వేలు విలువైన పుస్తకాలు, ప్రొజెక్టరు, గంటకు వంద లీటర్లు సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రం వంటి సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 80మంది విద్యార్థులున్నారు.
ఆనందంగా ఉంది..
గుండా మధుసూదన్, సుమధుర ఫౌండేషన్, ఛైర్మన్
స్వగ్రామం ఇస్కిల్లలో పూర్తి స్థాయిలో పాఠశాల భవనాన్ని నిర్మించటం ఆనందంగా ఉంది. నేను పుట్టిపెరిగిన గ్రామంలో సేవ చేయాలనే నా కల సాకారమైంది. మారుమూల ప్రాంతమైన ఈ గ్రామంలో నగరం తరహాలో అన్ని హంగులతో పాఠశాల భవనం అందుబాటులోకి వచ్చింది. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలన్నదే నా లక్ష్యం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ పాఠశాల వారధిగా నిలుస్తుందని నమ్ముతున్న. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రి ఆలయంలో హుండీ లెక్కింపు
[ 07-12-2023]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం ఆలయ హుండీల సొత్తు లెక్కింపును చేపట్టారు. -
అమాత్యయోగం ఎంతమందికో..?
[ 07-12-2023]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంత మందికి అమాత్యయోగం దక్కనుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. -
మరిన్ని నీళ్లు పోశాం.. మంచి ఫలాలివ్వాలి మరి!
[ 07-12-2023]
మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు. అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’ -
ఇక పంచాయతీల్లో ఎన్నికల పండగ..!
[ 07-12-2023]
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అశోక్కుమార్ జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
[ 07-12-2023]
నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు. -
రైతుల ఖాతాల్లో రూ. 598 కోట్లు జమ
[ 07-12-2023]
జిల్లాలో 191 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్వో వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. -
రెవెన్యూ డివిజన్ కల సాకారమయ్యేనా..?
[ 07-12-2023]
ఆలేరు పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కాలంగా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. -
కొలాబ్తో కార్యాలయ పని సులభతరం: కలెక్టర్
[ 07-12-2023]
కొలాబ్ఫైల్స్ ఎన్ఐసీ వెబ్ అప్లికేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. -
యాదాద్రిలో పంచనారసింహుల ఆరాధనలు
[ 07-12-2023]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో కార్తిక మాసం నాలుగో బుధవారం నిత్య ఆరాధనలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణం, సుదర్శన హోమాది పర్వాలతో పాటు అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. -
విన్నపాలు విన్నారు.. పరిష్కరించారు
[ 07-12-2023]
సూర్యాపేట నియోజకవర్గంలోని ఉండ్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ఆస్తులకు పార్టీల గుర్తులు వేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కరపత్రాలు విద్యుత్తు స్తంభాలకు అతికిస్తున్నారని ఫిర్యాదు అందింది. -
ధాన్యం ఆరబోత.. తప్పని అవస్థ
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తడిసిన ధాన్యం ఆరబోసుకుంటూ.. మళ్లీ వర్షం కురిస్తే దగ్గరికి చేసుకుంటూ నానాఅవస్థలు పడుతున్నారు. -
పార్టీలు మారి.. విజేతగా నిలిచి
[ 07-12-2023]
రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం. -
వారూ ఓటేశారు..!
[ 07-12-2023]
-
పరీక్ష నెగ్గితే ఉపకార వేతనం
[ 07-12-2023]
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. -
అర్హత కాదు.. అవకాశాలు ముఖ్యం
[ 07-12-2023]
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..నిజం మరిచి నిదుర పోకుమా...’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా, -
నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు
[ 07-12-2023]
చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే. -
ధరావత్తు దక్కకపోయినా .. మళ్లీ పోటీ
[ 07-12-2023]
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది.


తాజా వార్తలు (Latest News)
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Sachin - Kohli: ‘సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం చాలా కష్టం’
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
Israel-Hamas: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం.. భారత్ సంతతి సైనికుడి మృతి