పాల్వాయి స్రవంతికి మాతృవియోగం
కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి పాల్వాయి స్రవంతి తల్లి, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్రెడ్డి సతీమణి సృజమణి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.
పాల్వాయి సృజమణి
చండూరు, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి పాల్వాయి స్రవంతి తల్లి, దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్రెడ్డి సతీమణి సృజమణి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని వారి స్వగ్రామం ఇడికూడలో ఆమె నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తూ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో బుధవారం చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్లోని వారి నివాసానికి తీసుకెళ్లారు. గురువారం ఇడికూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
మహిళ బలవన్మరణం
ఆత్మకూరు(ఎం), న్యూస్టుడే: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని పోసానికుంటకు చెందిన సుడి నర్సిరెడ్డి, అండమ్మల కుమార్తె మంజుల (40)కు సుమారు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన వ్యక్తితో వివాహమై, ఇద్దరు కుమారులున్నారు. 12 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఆత్మకూరులో తల్లి వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హైదరాబాద్లోని నానమ్మతో కలిసి ఉంటున్నారు. బుధవారం సాయంత్రం మంజుల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించింది. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు కాలేదని ఎస్సై డి.నాగరాజు తెలిపారు.
టెట్ సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య
ఆరు నెలల కిందటే వివాహం.. అంతలోనే విషాదం
నార్కట్పల్లి గ్రామీణం, న్యూస్టుడే: టెట్ సరిగా రాయలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన నార్కట్పల్లి మండలం బాజకుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాజకుంట వాసి చిల్లర ఉమ(24) ఈ నెల 15న నిర్వహించిన టెట్ రాశారు. పరీక్ష సరిగా రాయలేకపోయానని మనస్తాపం చెందిన ఆమె ఈ నెల 18న ఇంటి వద్ద కలుపు నివారణ మందు తాగారు. విషయం తెలుసుకుని ఆమెను కుటుంబ సభ్యులు నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఉమకు అదే గ్రామానికి చెందిన సాయికుమార్తో ఆరు నెలల క్రితమే వివాహమైంది. తండ్రి పల్లగొర్ల ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదాబాబు తెలిపారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్టుడే: దిచక్ర వాహనంతో కుక్కను ఢీకొని రోడ్డు డివైడర్ ఇనుప గ్రిల్పై పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని అవంతీపురం గ్రామంలో గల కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. చేతికంది వచ్చిన కుమారుడి మృతితో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. స్థానికులు, గ్రామీణ ఎస్సై డి.నర్సింహులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన చరణ్ అలియాస్ ఆలేటి చంద్రకాంత్(23) అమ్మ, అన్న, వదినతో కలసి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో నివాసముంటూ గడ్డిపల్లిలోని ఓ బియ్యం మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నారు. స్వగ్రామం కొత్తగూడెంలో మేనమామ సోమయ్య ఇంటికి మంగళవారం రాత్రి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో గడ్డిపల్లికి వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై చంద్రకాంత్ బయలుదేరారు. కొత్తగూడెం గ్రామంలో గల అద్దంకి-నార్కట్పల్లి రహదారి మీదుగా కోదాడ-జడ్చర్ల ప్రధాన రోడ్డుపై అవంతీపురం గ్రామానికి చేరుకోగానే.. వేగంగా పరుగెత్తుకుంటూ రోడ్డుపై అడ్డంగా వచ్చిన కుక్కను ఢీకొని, రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ ఇనుప గ్రిల్పై పడ్డారు. దీంతో చంద్రకాంత్ శరీరం, తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా.. ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చంద్రకాంత్ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. సోదరుడు ఆలేటి శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం
కనగల్, న్యూస్టుడే: ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తు దానికింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం శేరిలింగోటం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నర్ర అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రాకేష్(35) మంగళవారం రాత్రి నల్గొండ నుంచి గ్రామానికి వస్తుండగా శేరిలింగోటం వద్ద సర్వీస్ రోడ్డులో ట్రాక్టర్ అదపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. డ్రైవర్ సీట్లో ఉన్న రాకేష్ కింద పడటంతో వెనుక టైరు అతడి మీద నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన రాకేశ్ను చికిత్స నిమిత్తం 108లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు
ప్రాణం తీసిన విద్యుత్తు కంచె
నాగారం, న్యూస్టుడే: విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని డి.కొత్తపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.కొత్తపల్లికి చెందిన మామిడాల సత్యనారాయణ పొలాన్ని మోదాల లింగయ్య కౌలుకు తీసుకొని వరి సాగుచేస్తున్నారు. కోతుల బెడద కారణంగా పొలం చుట్టూ విద్యుత్తు కంచె ఏర్పాటుచేసుకున్నారు. ఈ విషయం తెలియని ఆ గ్రామస్థురాలు ఇరుగు యశోద(50) పాడిగేదెకు మేత కోసం గడ్డి కోయడానికి మంగళవారం సాయంత్రం ఆ పొలానికి వెళ్లారు. విద్యుత్తు కంచెను గమనించకుండా గడ్డి కోయడంతో విద్యుదాఘాతానికి గురై యశోద అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా పొలంలో విగత జీవిగా పడిపోయి ఉన్న యశోదను గుర్తించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు బుధవారం సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు సర్ది చెప్పి ఆందోళన విరమించారు. మృతురాలికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 08-12-2023]
దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!