పెరిగిన వినియోగం.. విద్యుత్తు వ్యవస్థపై భారం
సాగర్ ఆయకట్టుతోపాటు విద్యుత్తు పంపుసెట్లతో సాగుచేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
గరిడేపల్లి: గారకుంట తండా శివారులో వాడుతున్న వరిపైరు
గరిడేపల్లి, న్యూస్టుడే: సాగర్ ఆయకట్టుతోపాటు విద్యుత్తు పంపుసెట్లతో సాగుచేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వానా కాలమైనా వర్షాల జాడ లేకపోవడంతో సాగులో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి రైతులు అత్యధికంగా విద్యుత్తు మోటర్లను వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్తు ఉప కేంద్రంలోని నియంత్రికలపై భారం పడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే లైన్లు లోడ్ తట్టుకోలేకపోతున్నాయి. నిత్యం బ్రేక్డౌన్లు, అంతరాయాలు ఏర్పడి సాగుకు సక్రమంగా విద్యుత్తు సరఫరా లేక పొలాలు వాడుపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవడమో.. లేదంటే సాగర్ నీరు ఒక తడి వస్తేనే వేసిన పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
వరుణుడి జాడలేక..
వానాకాలంలో వర్షాలు దోబూచులాట ఆడుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరంభంలో ఒకసారి భారీగా వర్షం పడినా తర్వాత ముఖం చాటేశాయి. నెల రోజులకు అంటే ఈనెల మొదటి వారంలో భారీ వర్షం పడింది. దాంతో రైతులు బోర్లు, బావుల కింద ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. ఆ తర్వాత వర్షం జాడ లేకపోవడంతో పొలాలు తడిసే పరిస్థితి లేదు. 24 గంటల విద్యుత్తు సరఫరా ఉంటుందని రెండు అంగుళాల నీరు పోసే బోర్ల కింద మూడు ఎకరాల వరకు నాట్లు వేశారు. వర్షం అడపాదడపా పడుతుంటే భూగర్భ జలాలు పెరగడంతో పాటు నీరు అంత అవసరం ఉండదని భావించి ముమ్మరంగా నాట్లు వేశారు. ఇప్పుడు వర్షం జాడ కన్పించడం లేదు.
అధికారులు సతమతం
లోడ్ పెరుగుతుండటం, నిత్యం బ్రేక్డౌన్లు అవుతుండటంతో ఏం చేయాలో తెలియక విద్యుత్తు అధికారులు సతమతమవుతున్నారు. ఒకవైపు బిల్లుల వసూళ్లు, రీడింగ్ల నమోదు, గృహ వినియోగ సర్వీసుల సమస్యలు చూస్తూ వ్యవసాయానికి వచ్చే లైన్లు బ్రేక్డౌన్ అవుతుండటంతో అటూ ఇటూ పరుగెత్తలేక క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. సిబ్బంది కొరతతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కాస్త కరంటు గురించి తెలిసిన యువకులు సొంతంగా మరమ్మతులు చేసుకుంటున్నారు. లైన్లు బ్రేక్డౌన్ అయినపుడు సైతం విద్యుత్తు అధికారులకు సహకారం అందిస్తున్నారు. విద్యుత్తు మోటర్ల డిమాండ్కు అనుగుణంగా నియంత్రికలు ఏర్పాటుచేయడంతో పాటు సమస్య ఉన్న లైన్లలో మరమ్మతులు చేయడం, ఇన్సులేటర్లు మార్చడం వంటి పనులు చేపడితే కరంటు నిరంతరాయంగా ఇవ్వొచ్చని రైతులు పేర్కొంటున్నారు.
భారీగా పెరిగిన మోటార్ల వాడకం
సాగర్ ఎడమ కాల్వకు నీరు రాదనే కచ్చితమైన నిర్ణయానికి వచ్చిన రైతులు తమ పొలాలను కాపాడుకోవడానికి బోర్లు వేశారు. ఈ ఒక్క సీజన్లోనే 300కు పైగా బోర్లు వేసినట్లు అంచనా. అధికారికంగా అనుమతి లేకపోయినా పంటను కాపాడుకునేందుకు వాటికి మోటర్లు ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటికే ఉన్న వ్యవసాయ మోటర్లకే పరిమితమైన నియంత్రికల సామర్థ్యానికి కొత్తవి తోడవడంతో సబ్స్టేషన్లపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా అందులోని పరికరాలు కాలిపోతున్నాయి. పలు ఉప కేంద్రాలు లోడ్ తట్టుకోకపోవడంతో ఇప్పటికే అధిక సామర్థ్యమున్న పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేశారు. అయినా లోడ్ పెరుగుతూనే ఉంది. వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి తోడు ఎండల తీవ్రతకు రాత్రి, పగలు ఏసీలు వాడుతూనే ఉన్నారు. అటు గృహ, వ్యవసాయ వినియోగం పెరిగి నిత్యం అంతరాయాలు ఏర్పడుతున్నాయి. లైను తెగిపోవడం, కాలిపోవడం, నియంత్రికల వద్ద ఫ్యూజులు మాడిపోవడం సాధారణమవుతోంది. దీంతో వ్యవసాయానికి 18 గంటల కరంటు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. కొన్ని ఫీడర్ల కింద 16 నుంచి 18 గంటల సరఫరా సాగుతున్నా అత్యధిక లోడు ఉన్న ఫీడర్ల కింద సరఫరా చేయలేకపోతున్నారు. నిత్యం అటూ ఇటూ మారుస్తుండటంతో రైతులకు పొలాలు తడవక రోడ్డెక్కుతున్నారు. విద్యుత్తు హెచ్చుతగ్గులు, బ్రేక్డౌన్లు కావడంతో మోటర్లపై ప్రభావం పడుతోంది. నిత్యం ఏదో ఒక మోటరు కాలిపోతుంది. స్టార్టర్లు, ఫ్యూజులు, మ్యాగ్నెట్లు, రిలేలు కాలిపోతున్నాయి.
భారమిలా..
విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు రెట్టింపు దశకు చేరింది. దీనికి ఉదాహరణగా గరిడేపల్లి మండలంలోని ఉప కేంద్రాల్లో లోడ్ పరిస్థితి పరిశీలిస్తే ఇలా ఉంది. (వినియోగం ఆంప్స్లలో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 08-12-2023]
దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ