గృహలక్ష్మి జాబితాలో అవకతవకలు జరిగాయని వాగ్వాదం
గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హుల పేర్లు కాకుండా భారాసలో ఉన్నవారివే ఉన్నాయని, ఆరోపిస్తూ గ్రామస్థులు ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు.
పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన దృశ్యం
నిడమనూరు, న్యూస్టుడే: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హుల పేర్లు కాకుండా భారాసలో ఉన్నవారివే ఉన్నాయని, ఆరోపిస్తూ గ్రామస్థులు ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. కార్యాలయంలోని సామగ్రిని పగులగొట్టి, తాళం వేసిన ఘటన మండలంలోని ముకుందాపురంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లబ్ధిదారుల జాబితా గురించి పంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుడు మంజుల శ్రీను, మాజీ సర్పంచి మండారి శివ, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు సర్పంచిని అడిగారు. తమ దగ్గర ఉన్న జాబితాలో భారాస వారి పేర్లే ఉన్నాయని, అసలైన అర్హుల పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి శంకర్, కార్యదర్శి కోటేష్లు మాట్లాడుతూ ఇంకా తుది, అధికారిక జాబితా రాలేదని, అర్హులైన వారికే ఇళ్లు వస్తాయన్నారు. వారి సమాధానానికి సంతృప్తి చెందిన గ్రామస్థులు ఇటీవల ఇళ్ల పట్టాలు, బీసీ రుణాల మంజూరులో కూడా అర్హులను పక్కన పెట్టి, అనర్హులకు పట్టాలు ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. ఘర్షణ పెద్దది కావటంతో పంచాయతీ కార్యాలయంలోని చెక్క బల్లాలు, కుర్చీలను కొన్నింటిని ధ్వంసం చేసి చివరికి పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవో ప్రమోద్కుమార్తో ఈ విషయం చర్చించగా, అర్హులైన వారికే ఇళ్లు మంజూరవుతాయని వారికి వివరించగా, ఎంపీడీవోకు పంచాయతీ కార్యాలయ తాళాలను అప్పగించారు. ఈ విషయంపై సర్పంచిని వివరణ కోరగా ఎలాంటి జాబితా రాలేదని, కార్యాలయంలో సామగ్రిని ధ్వంసం చేసిన ఘటనపై నిడమనూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రి ఆలయంలో హుండీ లెక్కింపు
[ 07-12-2023]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం ఆలయ హుండీల సొత్తు లెక్కింపును చేపట్టారు. -
అమాత్యయోగం ఎంతమందికో..?
[ 07-12-2023]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంత మందికి అమాత్యయోగం దక్కనుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. -
మరిన్ని నీళ్లు పోశాం.. మంచి ఫలాలివ్వాలి మరి!
[ 07-12-2023]
మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు. అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’ -
ఇక పంచాయతీల్లో ఎన్నికల పండగ..!
[ 07-12-2023]
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అశోక్కుమార్ జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
[ 07-12-2023]
నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు. -
రైతుల ఖాతాల్లో రూ. 598 కోట్లు జమ
[ 07-12-2023]
జిల్లాలో 191 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్వో వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. -
రెవెన్యూ డివిజన్ కల సాకారమయ్యేనా..?
[ 07-12-2023]
ఆలేరు పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కాలంగా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. -
కొలాబ్తో కార్యాలయ పని సులభతరం: కలెక్టర్
[ 07-12-2023]
కొలాబ్ఫైల్స్ ఎన్ఐసీ వెబ్ అప్లికేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. -
యాదాద్రిలో పంచనారసింహుల ఆరాధనలు
[ 07-12-2023]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో కార్తిక మాసం నాలుగో బుధవారం నిత్య ఆరాధనలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణం, సుదర్శన హోమాది పర్వాలతో పాటు అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. -
విన్నపాలు విన్నారు.. పరిష్కరించారు
[ 07-12-2023]
సూర్యాపేట నియోజకవర్గంలోని ఉండ్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ఆస్తులకు పార్టీల గుర్తులు వేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కరపత్రాలు విద్యుత్తు స్తంభాలకు అతికిస్తున్నారని ఫిర్యాదు అందింది. -
ధాన్యం ఆరబోత.. తప్పని అవస్థ
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తడిసిన ధాన్యం ఆరబోసుకుంటూ.. మళ్లీ వర్షం కురిస్తే దగ్గరికి చేసుకుంటూ నానాఅవస్థలు పడుతున్నారు. -
పార్టీలు మారి.. విజేతగా నిలిచి
[ 07-12-2023]
రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం. -
వారూ ఓటేశారు..!
[ 07-12-2023]
-
పరీక్ష నెగ్గితే ఉపకార వేతనం
[ 07-12-2023]
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. -
అర్హత కాదు.. అవకాశాలు ముఖ్యం
[ 07-12-2023]
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..నిజం మరిచి నిదుర పోకుమా...’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా, -
నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు
[ 07-12-2023]
చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే. -
ధరావత్తు దక్కకపోయినా .. మళ్లీ పోటీ
[ 07-12-2023]
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది.


తాజా వార్తలు (Latest News)
-
Meftal: ఈ పెయిన్ కిల్లర్తో జాగ్రత్త : అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం!
-
Cricket News: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో వరల్డ్ కప్ హీరోలు.. టీ20 వరల్డ్ కప్ కొత్త లోగో!
-
janasena: ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను: పవన్
-
TS Cabinet: ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన తెలంగాణ కేబినెట్
-
SRH-IPL 2024: రచిన్ కోసం ఎస్ఆర్హెచ్ భారీ మొత్తం పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
ఖతార్లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ