అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి: జూలకంటి
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడించారు.
కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధంగా ఉన్న ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నాలుగు గంటల పాటు బైఠాయించి నినదించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పది రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నందున సీఎం స్పందించాలన్నారు. కనీసవేతనాలు, గ్రాడ్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ జీవోలు ఇచ్చి సమ్మె విరమింపచేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలవీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. పోరాడుతున్న సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీసవేతనాలు రూ.26వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు డైట్ కళాశాల నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సంఘం సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్షులు పొడిశెట్టి నాగమణి, వనం రాధిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ నాయకులు ఏసురత్నం, అంగన్వాడీల సంఘం నాయకులు కె.విజయలక్ష్మి, బి.పార్వతి, మణేమ్మ, సుమతమ్మ, శోభ, సలీం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 08-12-2023]
దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు