ఆదాయం గుత్తేదారుకు.. కష్టాలు వినియోగదారులకు
జిల్లాలోని వార సంతల్లో కూరగాయలతోపాటు పశువుల విక్రయాలు చేపడుతున్నారు. సంతల ద్వారా ప్రతి వారం ఆదాయం సమకూరుతున్నా వసతుల కల్పనకు నోచుకోవడం లేదు.
వారసంతల్లో కొరవడిన వసతులు
సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇలా బయట సాగుతున్న పశువుల క్రయవిక్రయాలు
భానుపురి, తిరుమలగిరి, న్యూస్టుడే: జిల్లాలోని వార సంతల్లో కూరగాయలతోపాటు పశువుల విక్రయాలు చేపడుతున్నారు. సంతల ద్వారా ప్రతి వారం ఆదాయం సమకూరుతున్నా వసతుల కల్పనకు నోచుకోవడం లేదు. అన్నీ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పశువుల క్రయవిక్రయదారులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు. వానొస్తే బురదమయమయ్యే ప్రాంతాల్లో కూరగాయలు కొనలేక వినియోగదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇదీ దుస్థితి..
జిల్లాలో మొత్తం ఆరు సంతలు ఉన్నాయి. మూడు పంచాయతీ ఆధ్వర్యంలో, రెండు మార్కెట్ కమిటీ, ఒకటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నూతనకల్ మండలం మిర్యాల, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ సంతలు ఉన్నాయి. వీటికి పంచాయతీ అధికారులు ఏటా వేలం నిర్వహిస్తున్నారు. ఈ సారి వేలంలో మిర్యాలలో రూ.8.50 లక్షలు, తుంగతుర్తి రూ.6.66 లక్షలు, నెమ్మికల్ సంతకు వేలం ద్వారా రూ.36.36 లక్షల ఆదాయం సమకూరింది. సూర్యాపేట మార్కెట్ యార్డు, కోదాడలో సంతలను మార్కెట్ అధికారులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో వారానికి రూ.75 వేలు, కోదాడలో రూ.30 వేల ఆదాయం వస్తోంది. తిరుమలగిరిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా రూ.14 లక్షలకు వేలం దక్కించుకున్నారు. వీటిల్లో పశువులు, గొర్రెలు, మేకలు, కూరగాయల విక్రయాలు సాగుతుంటాయి. పశువును విక్రయించినా.. కొనుగోలు చేసినా రూ.వెయ్యికి రూ.వంద చొప్పున గుత్తేదారులు తీసుకుంటారు. ఇలా ప్రతి వారం రూ.వేలల్లో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టిసారించడం లేదు.
తాగునీరు.. నీడ కరవు
వార సంతల్లో ప్రధానంగా తాగునీరు కరవైంది. పొద్దస్తమానం సంతలో నిరీక్షించి తాగునీటికి అరిగొస అనుభవిస్తున్నారు. పక్కనే దుకాణాల్లో కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. ఎలాంటి నీడ వసతి లేకపోవడంతో వర్షానికి తడుస్తూ.. ఎండలో ఇబ్బందులు పడుతూ క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. కనీసం రేకుల షెడ్లు కూడా లేకపోవడంతో కూరగాయల వ్యాపారులు ఎండలోనే విక్రయాలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. చుట్టూ ప్రహరీ నిర్మించ లేదు. ఇప్పటికైనా అధికారులు వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
తిరుమలగిరిలో గొడుగుల సాయంతో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు
సౌకర్యాలు కల్పిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో సంతలో సౌకర్యాలు కల్పిస్తాం. తాగునీరు, షెడ్ల నిర్మాణం, ప్రహరీ నిర్మించి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.
శ్రీను, మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
[ 02-12-2023]
పోలింగ్ ముగిసి ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంపై స్పష్టత రావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
నమోదులో చైతన్యం.. వినియోగంలో నిర్లక్ష్యం
[ 02-12-2023]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు చేపట్టింది. ఓటు నమోదు నుంచి వినియోగం వరకు ఓటర్లకు అన్ని రకాల సేవలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరువ చేసింది. అయినా గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గి.. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
[ 02-12-2023]
నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు ఓట్ల లెక్కింపు కోసం నల్గొండలోని దుప్పలపల్లి ఎఫ్సీఐ గోదాములకు శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు నకిరేకల్ నుంచి సాయుధ సిబ్బంది రక్షణతో తరలించారు. -
నాగార్జునసాగర్ ఆనకట్టపై భారీ భద్రత
[ 02-12-2023]
నాగార్జునసాగర్ ఆనకట్టపై రెండో రోజు ఉద్రిక్తత కొనసాగింది. ఏపీ పోలీసులు బుధవారం రాత్రి భారీస్థాయిలో సాగర్ డ్యాంను ఆక్రమించి, కుడి కాల్వకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. -
సజావుగా ఓట్ల లెక్కింపు: కలెక్టర్
[ 02-12-2023]
జిల్లా కేంద్రంలో 3న నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ తెలిపారు. తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. -
నారసింహుడి క్షేత్రంలో దైవారాధనలు
[ 02-12-2023]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలు, సంప్రదాయ కైంకర్యాలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయంలోని మూలవరులను మేల్కొల్పి హారతితో ఆరాధించారు. -
ఓట్లు అయిపాయే.. నాట్లకు వేళాయే..!
[ 02-12-2023]
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరినాట్లు మొదలయ్యాయి. నిన్నటి వరకు ఓట్ల పండగతో ఊరూరా నాయకుల ప్రచార సందడి, మైకుల మోత, ఇంటింటి ప్రచారం, బంధుగణం రాక, చివరి రోజు పంపకాలతో గడిచిపోయింది. -
దివ్యాంగుల్లో వెల్లివిరిసిన చైతన్యం
[ 02-12-2023]
పోలింగ్ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఐదు ఆదర్శ, ఐదు మహిళ, దివ్యాంగులు, యువతకు ఒకటి చొప్పున ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
వినియోగం పెరిగింది
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందడి ముగిసింది. తమ పార్టీ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు అభ్యర్థులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. -
అట్లయితే అట్ల.. ఇట్లయితే ఇట్ల..!
[ 02-12-2023]
పోలింగ్ ముగిసింది. అభ్యర్థులతో సహా చోటా నాయకులంతా ప్రచారం ఒత్తిడి నుంచి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పోలింగ్ ఎట్ల జరిగింది? ఏ బూత్లో ఓట్లు ఎట్ల పోలైనయి? అని సోంచాయించుకుంట కుర్శీల కూసుండు పోటీచేసిన అభ్యర్థి వెంకటేశు. -
ఓట్ల పండగ అయిపోయింది
[ 02-12-2023]
ఓట్ల పండగ అయిపోయిందని.. ఇక మన మందు మనమే తాగాలని.. మన బిర్యాన్ని మనమే తినాలంటూ.. మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు, కళాకారుడు మల్లవ వెంకటేశం శుక్రవారం డప్పుతో దండోరా వేశాడు. -
గెలుపా.. ఓటమా?
[ 02-12-2023]
ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? విజయావకాశాలు ఉన్నాయా? ఏ వర్గం ఎవరికి అనుకూలం?.. ఇదే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రధాన చర్చ. పోలింగ్ ముగిసిన నేథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. -
ఫలితాలపై జోరుగా పందేలు
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకరి ద్వారా ఒకరికి గొలుసు కట్టు పద్ధతిన పందేలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో పాటు, వారు ఎంపిక చేసిన నియోజకవర్గాలపై పందేలు నడుస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం
[ 02-12-2023]
రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్యకు తీవ్రగాయాలైన ఘటన సూర్యాపేట పురపాలిక పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఓటెత్తిన వనిత
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల్లో మహిళలు ఓటుహక్కు వినియోగించుకొని మరోసారి సత్తా చాటారు. గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడంతో వారు పురుషులతో పోటీ పడ్డారు. పురుషుల కంటే ఎక్కువ మంది ఓటు వేసి న్యాయనిర్ణేతలుగా నిలిచారు. -
సత్వర న్యాయం అందించేందుకు కృషి చేద్దాం
[ 02-12-2023]
న్యాయమూర్తులు, న్యాయవాదులు సమష్టిగా కృషి చేసి కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అమరావతి అన్నారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
[ 02-12-2023]
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెరిగితేనే నియంత్రించవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ పరిపూర్ణాచారి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో... -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట ధర్నా
[ 02-12-2023]
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధర్నా నిర్వహించిన ఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..


తాజా వార్తలు (Latest News)
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా