పోటీల్లో రాణించి.. క్రీడా పాఠశాలల్లో చేరి
బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది.
జిల్లా నుంచి 16 మంది విద్యార్థుల ఎంపిక
సూర్యాపేçËలో క్రీడా పాఠశాల ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతోపాటు ఆటల్లోనూ శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చడమే ఈ పాఠశాలల లక్ష్యం. వీటిల్లో ప్రవేశానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 4, 5 తరగతుల విద్యార్థులకు మెడిసిన్ బాల్ త్రో, 800 మీటర్ల పరుగు, స్టాడింగ్ బ్రాడ్జంప్, వర్టికల్ జంప్, షటిల్ రన్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, ఫ్లెక్సిబులిటీ తదితర పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా స్థాయిలో బాలబాలికలకు పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ మళ్లీ ఆయా క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. జిల్లా నుంచి 25 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనగా 16 మంది సత్తాచాటి క్రీడా పాఠశాలలకు ఎంపికయ్యారు. హకీంపేట (హైదరాబాద్), కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలల్లో నాలుగు, అయిదు తరగతుల్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే పాఠశాలల్లో చేరగా.. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఆటలపై మక్కువతో సాధన
ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నా. నాన్న సురేందర్ ప్రైవేటు ఉద్యోగి. క్రీడలపై మక్కువతో పోటీల్లో పాల్గొంటున్నా. క్రీడా పాఠశాలలో చదువుకోవాలనే తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేందుకు సాధన చేశా. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పరుగు పందెంలో రాణించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నా.
గుగులోతు దివ్యశ్రీ, రావులపల్లి ఎక్స్రోడ్డుతండా, తుంగతుర్తి
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని..
స్థానికంగా ఐదో తరగతి చదువుతున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొమ్మిది విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అత్యధిక మార్కులు సాధించి క్రీడా పాఠశాలకు ఎంపికయ్యాను. తండ్రి వెంకన్న ప్రోత్సాహం, ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతో ఆటల్లో రాణిస్తున్నా. అంతర్జాతీయ స్థాయి ఆటల్లో రాణించాలని ఇప్పటి నుంచే సాధన చేస్తున్నా.
సూరారపు రేష్మ, వెంపటి, తుంగతుర్తి
సత్తా చాటిన సోదరులు
ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్కు చెందిన సూర సుమన్ కుమారులు సిద్ధు నాలుగు, శ్రీనాథ్ అయిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరికి చిన్ననాటి నుంచి క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. వీరి ఆసక్తిని గ్రహించిన తండ్రి సుమన్ చిన్నారులను క్రీడా పాఠశాలలో చేర్పించేందుకు తొమ్మిది విభాగాల క్రీడల్లో సత్తా చాటేందుకు తర్ఫీదు ఇచ్చారు. తండ్రి ఇచ్చిన శిక్షణతోనే వారిద్దరూ క్రీడా పాఠశాలకు ఎంపికయ్యారు. అన్నదమ్ములు ఎంపికవడంతో ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. ‘నాన్న ప్రోత్సాహంతోనే పాఠశాలకు ఎంపికయ్యామని, కబడ్డీలో జాతీయ స్థాయిలో ఆడి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామ’ని సోదరులు సిద్ధు, శ్రీనాథ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యయోగం ఎంతమందికో..?
[ 07-12-2023]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంత మందికి అమాత్యయోగం దక్కనుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. -
మరిన్ని నీళ్లు పోశాం.. మంచి ఫలాలివ్వాలి మరి!
[ 07-12-2023]
మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు. అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’ -
ఇక పంచాయతీల్లో ఎన్నికల పండగ..!
[ 07-12-2023]
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అశోక్కుమార్ జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
[ 07-12-2023]
నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు. -
రైతుల ఖాతాల్లో రూ. 598 కోట్లు జమ
[ 07-12-2023]
జిల్లాలో 191 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్వో వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. -
రెవెన్యూ డివిజన్ కల సాకారమయ్యేనా..?
[ 07-12-2023]
ఆలేరు పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కాలంగా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. -
కొలాబ్తో కార్యాలయ పని సులభతరం: కలెక్టర్
[ 07-12-2023]
కొలాబ్ఫైల్స్ ఎన్ఐసీ వెబ్ అప్లికేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. -
యాదాద్రిలో పంచనారసింహుల ఆరాధనలు
[ 07-12-2023]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో కార్తిక మాసం నాలుగో బుధవారం నిత్య ఆరాధనలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణం, సుదర్శన హోమాది పర్వాలతో పాటు అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. -
విన్నపాలు విన్నారు.. పరిష్కరించారు
[ 07-12-2023]
సూర్యాపేట నియోజకవర్గంలోని ఉండ్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ఆస్తులకు పార్టీల గుర్తులు వేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కరపత్రాలు విద్యుత్తు స్తంభాలకు అతికిస్తున్నారని ఫిర్యాదు అందింది. -
ధాన్యం ఆరబోత.. తప్పని అవస్థ
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తడిసిన ధాన్యం ఆరబోసుకుంటూ.. మళ్లీ వర్షం కురిస్తే దగ్గరికి చేసుకుంటూ నానాఅవస్థలు పడుతున్నారు. -
పార్టీలు మారి.. విజేతగా నిలిచి
[ 07-12-2023]
రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం. -
వారూ ఓటేశారు..!
[ 07-12-2023]
-
పరీక్ష నెగ్గితే ఉపకార వేతనం
[ 07-12-2023]
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. -
అర్హత కాదు.. అవకాశాలు ముఖ్యం
[ 07-12-2023]
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..నిజం మరిచి నిదుర పోకుమా...’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా, -
నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు
[ 07-12-2023]
చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే. -
ధరావత్తు దక్కకపోయినా .. మళ్లీ పోటీ
[ 07-12-2023]
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది.