శాస్త్రోక్తంగా యాదాద్రీశుల నిత్యకల్యాణం
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులను గురువారం కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.
అలంకార జోడు సేవ
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులను గురువారం కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆలయ నిత్య కైంకర్యాలలో భాగంగా వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవరులను మేల్కొలిపి బిందెతీర్థం, బాలభోగం నివేదించాక హారతితో కొలిచారు. గోవుపాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. ఆలయ మహాముఖ మండపంలో వేద, మంత్ర పఠనాల మధ్య అష్టోత్తరం, స్వర్ణపుష్పార్చన పర్వాన్ని కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణమూర్తులను గజవాహనంపై అధిష్ఠింపజేసి సేవా పర్వాన్ని చేపట్టారు. సాయంత్రం భక్తుల ఆర్జిత పూజల్లో భాగంగా అలంకార సేవోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య అలంకార సేవలు ఊరేగించారు. రాత్రి స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. దర్బార్ సేవ చేపట్టి నిత్య ఆదాయం వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా రూ.19,82,890 చేకూరింది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. యాదాద్రి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం గణపతిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం చేపట్టిన పూజల్లో ఆలయాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించాలి: భారాస
[ 06-12-2023]
మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాయమని భారాస జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. -
ముందుచూపుతో.. ముప్పు తప్పు
[ 06-12-2023]
యాసంగిలో వరి, ఇతర పంటల సాగు సక్రమంగా సాగాలంటే విద్యుత్తు శాఖ ముందు చూపుతో వ్యవహరిస్తేనే.. కరెంటు కోతల ముప్పు నుంచి బయట పడటానికి వీలుంటుంది. వేసవిలో విద్యుత్తు డిమాండ్ భారీగా నమోదు కానుంది. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్
[ 06-12-2023]
యాసంగి పంటల సాగులో ప్రణాళిక ప్రకారం రైతులకు ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. -
మౌనంగా ఉన్నారు.. మాధ్యమం మాట విన్నారు
[ 06-12-2023]
ఒకప్పుడు.. ఎన్నికలంటే ఊరూరా గోడలపై రాతలు, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, నాయకుల ర్యాలీలు.. పబ్లిక్ మీటింగ్లు.. మైకులలో హోరెత్తే ప్రసంగాలు అన్నట్టుగా ఉండేది. పార్టీకి, అభ్యర్థికి కేవలం వారి మద్దతుదారులే ప్రచార సేనగా ఉంటూ గెలుపోటములను ప్రభావితం చేసేలా ప్రచార పర్వాన్ని నడిపించేవారు. -
జిల్లా అంతటా మిగ్జాం ప్రభావం
[ 06-12-2023]
జిల్లాలో మిగ్జాం తుపాన్ ప్రభావం విస్తరించింది. రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. చలిగాలి తీవ్రత పెరిగింది. నల్గొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి కమ్మేసింది. వర్షంతో పాటు చలిగాలులు వీచాయి. -
లక్ష్యం శతశాతం
[ 06-12-2023]
పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా ఎన్ని కార్యక్రమాలు చేపట్టి, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదవుతున్న విషయమై ఈ విద్యా సంవత్సరం మరింత లోతైన దృష్టి సారించాలని నిర్ణయించింది. -
తొలగిన కోడ్.. మొదలైన సమీక్షలు
[ 06-12-2023]
ఎన్నికల హడావుడి ముగిసింది.. కొత్త శాసనసభ కొలువు తీరనుంది. ఈ నెల 7న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోడ్ ఎత్తివేతతో అధికార యంత్రాంగం సాధారణ పరిపాలనపై దృష్టి సారించింది. -
విద్యుత్తు స్తంభాల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ను కలిసిన గుత్తా
[ 06-12-2023]
ఎన్నికల ప్రక్రియ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మంగళవారం శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎర్రవల్లిలో కలిశారు. -
చిన్న పార్టీలు.. పెద్ద ప్రభావం
[ 06-12-2023]
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపా, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో పాటు మరి కొన్ని పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో 87 మంది అభ్యర్థులు చిన్న పార్టీల నుంచి బరిలో నిలిచి 65,360 ఓట్లు కొల్లగొట్టారు. -
ఇమాంపేట.. పతకాల బాట
[ 06-12-2023]
చదువు, క్రీడలతో పాటు ఎన్సీసీలో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు సూర్యాపేట మండలం ఇమాంపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు. గతంలో 21 మంది విద్యార్థులు ఎన్సీసీ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. -
స్వీయ రక్షణ.. కరాటే శిక్షణ
[ 06-12-2023]
ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించేందుకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ పేరుతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 368 పాఠశాలల్లో నవంబరు 1 నుంచి శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 06-12-2023]
చౌటుప్పల్లో ఈ నెల 3న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారించారు. వివాహేతర సంబంధంతో భార్యే భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్లు చౌటుప్పల్ ఏసీపీ మొగులయ్య తెలిపారు. -
ముంచుకొచ్చిన మిగ్జాం.. అన్నదాత ఆగమాగం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను అన్నదాతలను తీవ్ర నష్టానికి గురిచేసింది. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. -
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో
[ 06-12-2023]
పదో తరగతిలో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో భిక్షపతి కోరారు. నల్గొండ మండలం దోమలపల్లి జడ్పీహెచ్ఎస్, పీఎస్ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. -
కేసులు తగ్గుతున్నా అప్రమత్తత అవసరమే!
[ 06-12-2023]
నల్గొండ జిల్లాలో గత కొంత కాలంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితుల సంఖ్య తగ్గుతున్నా అప్రమత్తత అవసరమేనని వైద్యులు చెబుతున్నారు. 16 ఏళ్ల క్రితం 9 శాతం ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.5 శాతానికి తగ్గింది. -
అక్రమ రవాణాకు చెక్పోస్టు
[ 06-12-2023]
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తారు. వీటిని నివారించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాటి ప్రభావాన్ని నిలువరించింది. -
వర్షంతో భక్తులకు ఇక్కట్లు
[ 06-12-2023]
యాదాద్రి పుణ్య క్షేత్రంలో తుపాన్ మిగ్జాం ప్రభావం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నుంచి మబ్బులు దట్టంగా కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు ఇక్కట్లు పాలయ్యారు. -
పాల ట్యాంకర్, లారీ ఢీ: డ్రైవర్ దుర్మరణం
[ 06-12-2023]
పాల ట్యాంకర్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పాలట్యాంకర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలో ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద మంగళవారం చోటు చేసుకోంది. -
జిల్లా అంతటా ముసురు
[ 06-12-2023]
మిగ్జాం తుపాన్ కారణంగా జిల్లా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. సోమవారం రాత్రి నుంచే జిల్లా అంతటా ముసురు ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో ఈ రోజు ఉదయం 8గంటల వరకు జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 1.6 మి.మీ.లు నమోదైంది. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
[ 06-12-2023]
మిగ్జాం తుపాన్ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హన్మంత్ కే.జెండగె ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, నీటి పారుదల, ఆర్అండ్బీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. -
కలిసొచ్చే కాలంలో.. నడిచొచ్చే పదవులకు కసరత్తు!
[ 06-12-2023]
శాసనసభ ఎన్నికల సందడి ముగియక ముందే స్థానిక సంస్థల ఎన్నికల పోటీపై ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో చర్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబరు 7న నిర్వహించగా.. 2019 జనవరి 21న గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2019 ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు, 2019 మే 6న ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. -
సజీవ దహనమైన ప్రయాణికుడి గుర్తింపు
[ 06-12-2023]
నల్గొండలో ప్రైవేటు ట్రావెల్స్లో సజీవ దహనం అయిన యువకుడిని గుర్తించినట్లు రూరల్ ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళుతూ నల్గొండ జిల్లా కేంద్రంలోని నార్కట్పల్లి-అద్దంకి రహదారి మర్రిగూడ బైపాస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు కాలిబూడిద అయింది. -
క్విజ్లో ‘తేజ’ విద్యార్థుల ప్రతిభ
[ 06-12-2023]
సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయం విద్యార్థులు అంతర్ పాఠశాలల క్విజ్ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. భారతీయ సైనిక దళం 25 ఏళ్ల కార్గిల్ విజయోత్సవాల్లో భాగంగా ‘బ్యాటిల్ ఆఫ్ మైండ్స్’ పేరుతో ఈ క్విజ్ పోటీలను నిర్వహించింది. -
ఘనంగా శౌరివారి మహోత్సవం
[ 06-12-2023]
పోర్చుగల్కు చెందిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవాళికి భక్తితత్వాన్ని ప్రబోధించిన ధన్యచరితుడని శుభవార్త దేవాలయ విచారణ గురువు ఫాదర్ మార్టిన్ పసల పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
INDw vs ENGw: అర్ధ శతకాలతో విరుచుకుపడ్డ నాట్ సీవర్, డేనియల్.. టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్
-
Tirumala: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
NTR 31: ఎన్టీఆర్తో సినిమా.. అంచనాలు పెంచేలా ప్రశాంత్ నీల్ అప్డేట్
-
Apply Now: ఫ్యాషన్ ప్రపంచం వైపు వెళ్తారా? ఇదిగో గొప్ప ఛాన్స్!