సోమవారం..మొర వినం..!
వీరిద్దరి సమస్యలే కాదు, ప్రతి సోమవారం మూడు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది.
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపని కలెక్టరేట్ ప్రజావాణి
ఏళ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం దక్కట్లేదని వాపోతున్న బాధితులు
ఈనాడు, నల్గొండ : వీరిద్దరి సమస్యలే కాదు, ప్రతి సోమవారం మూడు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. స్థానిక అధికారులను కలిసినా లాభం లేకపోవడంతో ఉన్నతాధికారులను కలిసి, తమ సమస్యలను విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న బాధితులకు ఇక్కడా న్యాయం జరగడం లేదు. తిరిగి స్థానిక అధికారులనే కలవాలని బాధితులను ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉసూరుమంటున్నారు. క్షేత్రస్థాయిలో భూ సంబంధిత సమస్యలు, ధరణి, ఆసరా పెన్షన్లు రావడం లేదని, రెండు పడకగదుల ఇళ్లను కేటాయించాలనే కారణాలతోనే ఎక్కువ మంది బాధితులు నిత్యం ప్రజావాణికి వస్తున్నారు. ఇటువంటి వారిని క్షేత్రస్థాయిలోని అధికారులను కలవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.... క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకక..కలెక్టరేట్కు వచ్చిన వారినీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వినతులు వేలల్లో...పరిష్కారం పదుల్లో...
మూడు జిల్లాల కలెక్టరేట్లకు ప్రతి సోమవారం వందల సంఖ్యలో బాధితులు ఉన్నతాధికారులను కలవడానికి వస్తున్నారు. సాధారణ రోజుల్లో కలిసేందుకు వచ్చిన వారు వీరికి అదనం. ఇలా ప్రతి దరఖాస్తును కలెక్టరేట్లో నమోదు చేస్తున్నారు. అయితే దరఖాస్తు పరిష్కారం రిపోర్టును మాత్రం నమోదు చేయడం లేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. నిత్యం వేలల్లో వినతులు వస్తున్నా...పరిష్కారం మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయని సమాచారం. ప్రజావాణికి వస్తున్న దరఖాస్తులను తప్పకుండా నమోదు చేసి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తే తప్పితే పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కావు. ఈ మేరకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలతో పోలిస్తే నల్గొండలోనే ప్రస్తుతం ఎక్కువ వినతులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన సరికొండ రామలింగరాజుకు సర్వే సంఖ్య 385/ఊలో రెండెకరాల భూమి ఉంది. అందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం పట్టా పుస్తకం మంజూరు చేసింది. ఏళ్ల నుంచి ఆ భూమిలో ఆయన సేద్యం చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ధరణిలో మాత్రం రెండెకరాలకు బదులు ఎకరం భూమిని మాత్రమే అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. దానినీ నిషేధిత జాబితాలో ఉంచారు. ఇది తన పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తి అని, తన భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఆన్లైన్లో రెండెకరాలనూ నమోదు చేయాలని రెండేళ్ల నుంచి నల్గొండ కలెక్టరేట్కు మూడు సార్లు వచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని బాధితుడు ‘ఈనాడు’తో వాపోయారు. అక్కడ, ఇక్కడ అంటూ తిప్పుతున్నారు తప్పితే తన సమస్యను ఎవరూ పట్టించుకోలేదని ఆయన ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. అంగవైకల్యంతో బాధపడుతున్న తాను ప్రతిసారీ నల్గొండకు రాలేకపోతున్నానని వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్లసింగారానికి చెందిన మడ్డి అంజయ్య సూర్యాపేటలోని ఎస్బీఐ బ్యాంకులో పంట రుణం తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం చేసిన రుణ మాఫీలో ఈయనకు రూ.60,622 మాఫీ అయినట్లు చరవాణికి సందేశం వచ్చింది. బ్యాంకులో అడిగితే రుణమాఫీ కాలేదని చెబుతున్నారని, గత నెల రోజుల్లో మూడు సార్లు కలెక్టరేట్లోని ప్రజావాణికి వస్తున్నానని...అయితే బ్యాంకు అధికారులను కలవాలని చెబుతున్నారు కానీ తన సమస్యను పరిష్కారం చేయడం లేదని అంజయ్య వాపోయారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
-
KCR: మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
-
Telangana Assembly: ప్రొటెం స్పీకర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ
-
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!