చూడచక్కని ప్రాంతాలు..ప్రకృతి నేస్తాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయడంతో యాదాద్రి క్షేత్రం రాష్ట్రంలోని భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది.
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
రాచకొండ ఖిల్లా ద్వారం
చౌటుప్పల్, న్యూస్టుడే: యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయడంతో యాదాద్రి క్షేత్రం రాష్ట్రంలోని భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే తరహాలో భువనగిరి కోట, కొలనుపాకలోని ప్రముఖ జైన మందిరం, సోమేశ్వరాలయం, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకునే అద్భుత ప్రదేశాలు. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి ఉత్తమ గ్రామంగా అవార్డు సాధించిన భూదాన్ పోచంపల్లి పట్టు చీరలకు ప్రసిద్ధి. అక్కడే భూదానోద్యమం ఊపిరి పోసుకుంది. దానికి సమీపంలోనే దేశ్ముఖి గ్రామంలో దేశంలోనే మొట్టమొదటి సాయిబాబా అష్టభుజి దేవాలయం నిర్మితమైంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో అంతర్జాతీయంగా పేరొందిన ఇక్కత్ డిజైన్లతో మగ్గాలపై చేనేత వస్త్రాలు తయారవుతాయి. దీనికి సమీపంలోనే సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో తెలంగాణ ప్రాంతమంతటికీ రాజధానిగా విలసిల్లిన రాచకొండ ఉంది. అక్కడి ప్రాచీన ఆలయాలు, శిలా శాసనాలు, ప్రకృతి సౌందర్యం ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన తేలియా రుమాల్ తయారు చేసే పుట్టపాక గ్రామం ఇక్కడే ఉంది. ఇక్కడి చేనేత కళాకారులు మగ్గాలపై తేలియా రుమాల్ తయారు చేసే ప్రక్రియ వైవిధ్యంగా ఉంటుంది. సిద్దోనిగూడెం శివారులోని గుట్టపై శ్రీ వీర వెంకటవర సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి నెలా ప్రత్యేకంగా వ్రతాలు నిర్వహిస్తుంటారు. వేణుగోపాల స్వామి, సాయిబాబా, ఇతర దేవతలు ఈ గుట్టపైనే కొలువుదీరారు. చౌటుప్పల్ పురపాలిక లింగోజీగూడెంలో ఆకట్టుకునే పురాతన మెట్లబావి ఉంది. ఈ ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేసి, తగిన ప్రచారం కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్థానికులకు ఉపాధి, హస్తకళలకు గుర్తింపుతో పాటు వాటిపై ఆధారపడిన కళాకారులకు చేతినిండా పని, ఆర్థికాభివృద్ధి జరగడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశముంది. బుధవారం ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం, పర్యటక శాఖ ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
చరిత్రకు నిలువుటద్దం.. ఉండ్రుగొండ గిరిదుర్గం
ఉండ్రుగొండ గిరిదుర్గంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన ఆలయం
చివ్వెంల, న్యూస్టుడే: ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చని చెట్లు, ఆధ్యాత్మికతను చాటే దేవాలయాలు, వివిధ రాజుల చరిత్రను తెలిపే శాసనాలు, ప్రాకారాలు, అబ్బురపరిచే పలు కట్టడాలతో చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తోంది ఉండ్రుగొండ గిరిదుర్గం. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సరిగ్గా 10 కి.మీ దూరంలో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో చివ్వెంల మండలం ఉండ్రుగొండ పంచాయతీ సమీపంలో ఈ కొండలు దర్శనమిస్తుంటాయి. ప్రకృతి రమణీయతను చాటే ఉండ్రుగొండ సొగసు చూపరులకు కనులవిందు చేస్తోంది.
చారిత్రక నేపథ్యం
గిరిదుర్గంలో ఎనిమిది ఎత్తయిన కొండలు, వాటిని కలుపుతూ ఉండే రాతి ప్రాకారాలను చూసి తీరాల్సిందే. 1400 ఎకరాల విస్తీర్ణ్ణం కలిగిన ఈ అడవిలోని కొండలను కలిపే ఉండే రాతి ప్రాకారం 14 కిలోమీటర్ల పొడవునా సుమారుగా 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తున ఉంటుంది. అప్పటి రాజులు శత్రువుల దాడి నుంచి రక్షణ పొందడానికి ఈ ప్రాకారాన్ని పటిష్ఠంగా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కనిపించే రాక్షస గూళ్లు ఆదిమ జాతి మానవుని మనుగడను చూపిస్తాయి. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటి ఆనవాళ్లు ఇక్కడి పలు దేవాలయాల గోడలపై కనిపిస్తుంటాయి. విష్ణుకుండినుల నాటి పలు వైష్ణవ దేవాలయాలు, మండపాలు శిథిలమయ్యాయి. రేచర్ల వెలమరాజుల దుర్గాలు, కళ్యాణ చక్రవర్తుల కాలం నాటి జంట వీరుల గుర్తులు, కాలభైరవ ప్రతిమలు ఇక్కడ కొలువుదీరాయి. ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రెడ్డిరాజులు, రేచర్ల వెలమరాజులు, చోళులు, కళ్యాణచాళుక్యులు, గజపతిరాజులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, తదితర రాజులు ఈ గిరిదుర్గాన్ని ఆవాసంగా ఏర్పాటుచేసుకొని పరిపాలన చేసినట్లుగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఇందుకు సాక్ష్యంగానే కోటగోడలు, రాజమందిరాలు, నర్తనశాలలు, కోనేర్లు, కొలిమిచావిడి తదితర కట్టడాలు నిలుస్తున్నాయి.
శ్రీస్వామికి నిత్యపూజలు
పదిహేనేళ్ల క్రితం గిరిదుర్గంలో బయటపడిన లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టు నిత్యపూజలు, హోమాలతో విరాజిల్లుతోంది. శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంతో పాటు శ్రీగంగామళ్లేశ్వరస్వామి దేవాలయాలను భక్తులు అధిక సంఖ్యలో సందర్శించి పూజలు చేస్తున్నారు. ఆంజనేయస్వామి, కాలభైరవ, లింగమంతులస్వామి తదితర దేవాలయాల్లో యాత్రికులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
ఆర్కియాలజీ కేంద్రం ఏర్పాటు చేయాలి
ఆదుర్తి రామయ్య, ఉండ్రుగొండ అభివృద్ధి కమిటీ సభ్యుడు
భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో వింతలు, విశేషాలు ఉండ్రుగొండ గిరిదుర్గంలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు గిరిదుర్గానికి వస్తున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆర్కియాలజీ కేంద్రం ఉంటే పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 08-12-2023]
దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
-
Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్ షా