పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
రానున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టరు వినయ్కృష్ణారెడ్డి వెల్లడించారు.
తుది దశకు ఓటరు జాబితా కసరత్తు
ఒకట్రెండు రోజుల్లో బస్వాపురం నిర్వాసితులకు పూర్తి పరిహారం
‘ఈనాడు’తో కలెక్టరు వినయ్కృష్ణారెడ్డి
ఈనాడు, నల్గొండ : రానున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టరు వినయ్కృష్ణారెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో షెడ్యూల్ విడుదల కానుందనే ప్రచారం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా నమోదు, ప్రచురణ, అధికారులకు శిక్షణా కార్యక్రమాలన్నీ తుది దశకు చేరాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’తో ఆయన మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు.
సమావేశానికి అంతా సిద్ధం
వచ్చే నెల 4న హైదరాబాద్లో సీఈసీ అధికారులతో కలెక్టర్ల సమావేశం ఉంది. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో)గా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న కసరత్తుపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంది. అందుకు అన్ని వివరాలను సిద్ధం చేశాం. ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణకు చేసిన కసరత్తును అందులో కేంద్ర అధికారులకు వివరిస్తాం. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని కమిటీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. షెడ్యూల్ విడుదలయిన క్షణం నుంచి అవన్నీ చురుగ్గా పనిచేస్తాయి. ఓటరు జాబితా తయారు నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు జరిగే క్రతువులో ఎక్కడా పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
మానవీయ కోణంలో..
బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారికి పెండింగ్లో ఉన్న నిధులు ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా విడుదల కానున్నాయి. నిర్వాసితుల సమస్యలను మానవీయ కోణంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అందుకు ప్రతి బుధవారం జిల్లా అధికారులందరితో కలిసి భూ సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాం. బీఎన్ తిమ్మాపురంతో పాటూ నిర్వాసితులందరికీ రావాల్సిన పరిహారం దక్కగానే రిజర్వాయర్ను పూర్తిగా నింపడానికి చర్యలు తీసుకుంటాం.
టెండర్లను ఆహ్వానించాం
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధి కార్యక్రమాలను చురుగ్గా చేయాలని నిర్ణయించాం. గ్రామంలో సుమారు 430కి పైగా ఇళ్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించాం. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుంది. దీంతో లే అవుట్ ప్రకారం ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతాం. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
బోగస్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ
‘ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బోగస్ ఓట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తొలగించాం. పోలింగ్ కేంద్రాల్లో ఇతరులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓటరు నమోదుకు సుమారు 33 వేల దరఖాస్తులు వచ్చాయి. అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నాం. ఓటరు గుర్తింపు కార్డులను నేరుగా ఓటరుకు పంపేందుకు కొత్త ఏజెన్సీని నియమించాం. ఓటరుగా నమోదైన వారం పది రోజుల్లో పోస్టు ద్వారా సదరు ఓటరుకు గుర్తింపు కార్డు వస్తుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపులో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కొత్త నిబంధనలను పాటించాలని ఆదేశించింది. దీని ప్రకారం రెండు నియోజకవర్గాల్లో సుమారు 100కు పైగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాల్సి వస్తోంది. షెడ్యూల్ విడుదల సమయంలో సీఈసీ నిబంధనలను అనుసరించి వాటిని ప్రకటిస్తాం. నోటిఫికేషన్ విడుదల అనంతరం సాంకేతికంగా నామినేషన్కు పది రోజుల ముందు వరకు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తాం. వాటిని తుది ఓటరు జాబితాకు అనుబంధంగా జోడిస్తాం. (నామినేషన్కు ముందు రోజు వరకూ ఓటరు నమోదుకు అవకాశం ఉన్నా...నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలకు పది రోజుల సమయం పడుతుండటంతో పది రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటేనే కొత్త ఓటరుగా అవకాశం ఉంటుంది).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 08-12-2023]
దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం
[ 08-12-2023]
అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. -
ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
[ 08-12-2023]
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
[ 08-12-2023]
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. -
సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
[ 08-12-2023]
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. -
అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
[ 08-12-2023]
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. -
పోస్టల్ బ్యాలెట్లోనూ.. కాంగ్రెస్దే హవా
[ 08-12-2023]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. -
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం
[ 08-12-2023]
కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
[ 08-12-2023]
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. -
ఎత్తిపోస్తే 90 వేల ఎకరాల్లో సాగు
[ 08-12-2023]
సాగర్ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు
[ 08-12-2023]
జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
[ 08-12-2023]
చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. -
9 నుంచి రాష్ట్రస్థాయి గురుకుల క్రీడా పోటీలు
[ 08-12-2023]
ఈ నెల తొమ్మిది నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల తొమ్మిదో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయని రీజినల్ ఆర్సీవో ఎన్.రజని తెలిపారు. -
లక్ష్యాన్ని పూర్తి చేయాలి
[ 08-12-2023]
వానాకాలం సీజన్ సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హన్మంతు కె.జెండగె అన్నారు. -
వివాహిత దారుణ హత్య
[ 08-12-2023]
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.


తాజా వార్తలు (Latest News)
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు