logo

Amaravati Padayatra: రెండ్రోజుల విరామం తర్వాత ‘మహాపాదయాత్ర’ ప్రారంభం

అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర 30వ రోజు కొనసాగుతోంది.

Updated : 19 Jan 2023 15:02 IST

నెల్లూరు: అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర 30వ రోజు కొనసాగుతోంది. రెండు రోజుల విరామం తర్వాత నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభమైంది. ఆమంచర్లలో రైతులు మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు. ఇవాళ 10కి.మీ. మేర సాగే యాత్ర మరుపూరులో ముగియనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబరు15న తిరుమలకు చేరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని