అటవీ సంపద జోలికొస్తే సహించేది లేదు
వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతుంటే సహించేది లేదు.. అటవీ సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సీహెచ్ విజయరావు అన్నారు. చిల్లకూరు మండలం బూదనం వద్ద 55మంది కూలీలతోపాటు ముగ్గురు ప్రధాన నిందితులు, 45 ఎర్రచందన దుంగలను
ఎస్పీ సీహెచ్ విజయరావు l 55 మంది కూలీలు, ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విజయరావు.. చిత్రంలో ఏఎస్పీ వెంకటరత్నం, గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి తదితరులు
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతుంటే సహించేది లేదు.. అటవీ సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సీహెచ్ విజయరావు అన్నారు. చిల్లకూరు మండలం బూదనం వద్ద 55మంది కూలీలతోపాటు ముగ్గురు ప్రధాన నిందితులు, 45 ఎర్రచందన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను ఆదివారం చెముడుగుంటలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్పీ వెల్లడించారు. మొత్తం 45ఎర్రచందన దుంగలు, 31 సెల్ఫోన్లు, రెండు వాహనాలు, 24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2రంపాలు, రూ.75,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను ఎస్పీ వెల్లడించారు. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన ఒల్లూరు దాము గతంలో ఆయిల్ ట్యాంకర్లు నడిపి నష్టం రావడంతో కుప్పన్న సుబ్రహ్మణ్యం వద్ద లారీ క్లీనర్గా పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో అయిదు నెలల క్రితం దాముకు పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వెలుమలైతో పరిచయమైంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు తెరలేపారు. ఈ క్రమంలో ఈ నెల 20న వీరు ముగ్గురితోపాటు పుదుచ్చేరికి చెందిన రాధాకృష్ణన్ పళని కొంతమంది కూలీలను తీసుకుని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దొరికే ఎర్రచందనం దుంగలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కూలీలను ఐషర్ వాహనంలో తీసుకురాగా, ప్రధాన నిందితులు ముగ్గురు ఒక కారులో బయల్దేరి చిత్తూరు జిల్లా రైల్వేకోడూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ని తీసుకుని గూడూరు నుంచి రాపూరు అడవుల్లోకి వెళ్లారు. 21న సాయంత్రం దుంగలతోపాటు వాహనాల్లో చెన్నై వైపు తరలిస్తుండగా చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అయితే, కూలీలు పోలీసులపై తిరగబడగా, అతి కష్టమ్మీద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరికైనా సమాచారం తెలిసినా మాకు తెలియజేయాలనీ, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎర్రచందన అక్రమార్కులను పట్టుబడటంలో ప్రతిభ కనబరిచిన గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, గ్రామీణ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట రత్నం, శ్రీనివాసరావు, ఎస్డీ డీఎస్పీ కోటారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...