సమర్థంగా ఎదుర్కొందాం..!
మూడో దశ కరోనా క్రమేపీ విస్తరిస్తోంది.. స్వల్ప లక్షణాలే అయినా ఎక్కువ మందికి పాకుతోంది.. హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.. అలక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో యంత్రాంగం మరింత పటిష్ఠంగా
పారదర్శకత సేవలతో కొవిడ్కు అడ్డుకట్ట
టీకా వేస్తున్న సిబ్బంది
మూడో దశ కరోనా క్రమేపీ విస్తరిస్తోంది.. స్వల్ప లక్షణాలే అయినా ఎక్కువ మందికి పాకుతోంది.. హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.. అలక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో యంత్రాంగం మరింత పటిష్ఠంగా సేవలందిస్తే.. కరోనా నివారణ సాధ్యమవుతుంది.
న్యూస్టుడే, నెల్లూరు(వైద్యం) మూడో దశ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజుకు వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్ దూకుడుకు కళ్లెం పడటం లేదు. మరోవైపు జిల్లా యంత్రాంగం పలు రకాల చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో లోపం వెంటాడుతూనే ఉంది. ఫలితంగా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. కేసులు సైతం పెరిగిపోతున్నా.. కట్టడి చర్యలు తూతూమంత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికే రాత్రి 11 దాటితే కర్ఫ్యూను అమలు చేస్తున్నా.. కేసుల కట్టడికి ఊతమివ్వడం లేదు. దాంతో మరింతగా కర్ఫ్యూ చర్యలను కఠినతరం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
త్వరితగతిన ఫలితాలివ్వాలి:జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రులు, సచివాలయాల్లో కరోనా నిర్ధారణకు నమూనాల సేకరణ జరుగుతోంది. ఈ పరీక్షలను పెంచాల్సి ఉన్నా.. కిట్ల కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. నమూనాలను జీజీహెచ్లోని వీఆర్డీఎల్ ల్యాబ్లోనే పరీక్షిస్తున్నారు. రోజుకు వేలకొద్ది కేసులు వస్తున్న నేపథ్యంలో ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. గూడూరు, కావలి ప్రాంతీయ ఆసుపత్రులు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రుల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం వీఆర్డీఎల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొస్తే ఆయా ప్రాంతాల్లోని వారికి త్వరితగతిన ఫలితాలు అందుతాయి. దాంతో బాధితులు త్వరగా చికిత్సలు తీసుకునే వీలుంటుంది.
హద్దు మీరుతున్న వసూళ్లు
జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లు సైతం ఐసీఎంఆర్ అనుమతి పొంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందుకు ప్రజల నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. వీటికి రూ.350 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు.
వ్యాక్సినేషన్లో లోపాలు:జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్లో లోపాలు సరిదిద్దాల్సి ఉంది. చాలా మందికి వేయకుండానే వేసినట్లు చరవాణిలకు సందేశాలు వస్తున్నాయి. ఫలితంగా అర్హులైన వారికి వ్యాక్సిన్ పొందడంలోనూ ఇబ్బందులు నెలకొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా తొలిడోసు కింద 25,75,444 మందికి వ్యాక్సిన్ను నూరుశాతం పూర్తి చేయగా, రెండో డోసు కింద 21,76,726 మంది వరకు వేశారు. వ్యాక్సిన్ కొరత సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
పక్కాగా ఫీవర్ సర్వే..
జిల్లాలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ఫీవర్ సర్వేను మరింత పటిష్ఠంగా నిర్వహించాల్సి ఉంది. ప్రతి వారం ఈ సర్వేను చేపడుతున్నారు. తమ పరిధిలోని ఇళ్ల వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని యాప్లో పొందుపరుస్తున్నారు. ఇలాగే వ్యాక్సిన్ వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా నిర్వహిస్తే.. జ్వర కేసులు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జరుగుతున్న ఫీవర్ సర్వేలోనూ పలు జ్వర పీడితులు వెలుగు చూస్తున్నారు.
త్వరలో గూడూరులో పరీక్షలు
- డాక్టర్ ఉమా, జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి
వైద్య విధాన పరిషత్ పరిధిలోని గూడూరు ఆసుపత్రిలోనూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు త్వరలో ప్రారంభమవుతాయి. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించాం. కొద్ది రోజుల్లోనే ఇక్కడా పరీక్షల నిర్వహణ అందుబాటులోకి వస్తుంది. దాంతో కొవిడ్ కేసుల ఫలితాలు త్వరితగతిన వెల్లడించేందుకు అవకాశముంది. ఆత్మకూరు, కావలి పరిధిలోని నమూనాలను జీజీహెచ్కు పంపుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెంచులక్ష్మీపురంలో ఇంటింటి ప్రచారం
[ 24-04-2024]
కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు -
తెదేపాలో చేరిక
[ 24-04-2024]
బోగోలు మండలం విశ్వనాధరావుపేట పంచాయతీ 6వ వార్డు వైకాపా నేత సుధీర్, ఎం. జయకుమార్ తెదేపాలో చేరారు. -
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు