logo

తగునా ఇలా..!

నాయుడుపేట పురపాలక సంఘం బిరదవాడ ఎదురుగా చేపట్టిన టిడ్కో ఇళ్ల వద్ద గురువారం కనిపించిందీ దృశ్యం. ఇక్కడ గతంలో 2740 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 600 వరకు పునాదుల దశలో ఆగాయి. మిగిలినవి పూర్తయ్యాయి. లబ్ధిదారులకు

Published : 28 Jan 2022 01:17 IST

 

టిడ్కో అపార్టుమెంట్ల వద్ద బారులు తీరిన మహిళలు

నాయుడుపేట పురపాలక సంఘం బిరదవాడ ఎదురుగా చేపట్టిన టిడ్కో ఇళ్ల వద్ద గురువారం కనిపించిందీ దృశ్యం. ఇక్కడ గతంలో 2740 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 600 వరకు పునాదుల దశలో ఆగాయి. మిగిలినవి పూర్తయ్యాయి. లబ్ధిదారులకు కేటాయింపులు జరిపారు. ఆ క్రమంలోనే లబ్ధిదారుల ఆధార్‌ కార్డులను జియోట్యాగ్‌ చేయాలంటూ.. సచివాలయ ఉద్యోగులు మహిళలను అపార్ట్‌మెంట్‌ వద్దకు రమ్మన్నారు. సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగగా.. కొవిడ్‌ నిబంధనలు పట్టించుకోకుండా ప్రజలు ఇలా పెద్ద సంఖ్యలో వచ్చి నిల్చున్నారు. ఈ విషయమై కమిషనర్‌ ఎల్‌.చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా.. కరోనా నిబంధనలు పాటిస్తూనే జియో ట్యాగింగ్‌ చేశామని చెప్పడం గమనార్హం. - న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు