జలపథం..సంక్లిష్టం
జిల్లాల పునర్విభజనపై అంతటా విస్తృత చర్చ జరుగుతోంది. సరిహద్దుల మొదలు.. ఆదాయ, ఉపాధి అంశాలపై ఆలోచన మొదలైంది. అదే సమయంలో కీలక ప్రాజెక్టుల నిర్వహణ- సాగునీటి ప్రయోజనాలపై ఆందోళన నెలకొంది. జిల్లాల విభజన తీరును పరిశీలిస్తే.
జిల్లాల పునర్విభజనపై అంతటా విస్తృత చర్చ జరుగుతోంది. సరిహద్దుల మొదలు.. ఆదాయ, ఉపాధి అంశాలపై ఆలోచన మొదలైంది. అదే సమయంలో కీలక ప్రాజెక్టుల నిర్వహణ- సాగునీటి ప్రయోజనాలపై ఆందోళన నెలకొంది. జిల్లాల విభజన తీరును పరిశీలిస్తే.. ఈ విషయం ఎవరికైనా బోధ పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో సానుకూల పరిష్కారం ఎలా ఉండనుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆత్మకూరు, న్యూస్టుడే : సోమశిల...అంతరాష్ట్ర ప్రాధాన్యమున్న జలాశయం. ఇప్పటి వరకు ఇది, కండలేరు జలాశయాలు ఒకే జిల్లా పరిధిలోనే ఉండటంతో సమస్యలు ఉత్పన్నం కాలేదు. జిల్లా సరిహద్దులు మారనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. కండలేరు జలాశయం.. దాని వరద కాలువలు పూర్తిగా తిరుపతి పరిధిలోకి వెళతాయి. ఇక సోమశిల దక్షిణ కాలువ పరిస్థితి. కలువాయి మండల పరిధి మొత్తం తిరుపతిలోకి వెళుతుంది. అంటే.. దక్షిణ కాలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నియంత్రణ వ్యవస్థలు మొత్తం అటువైపే ఉంటాయి. కండలేరు జలాశయం, వరద కాలువ, ఉప కాలువలు, దక్షిణ కాలువల నీరు నెల్లూరు జిల్లా రైతులకు చేరాలంటే.. ఆ జిల్లా అధికారుల అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కనిష్ఠ స్థాయిల్లో కష్టమే..
జలాలు పుష్కలంగా ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాలకు పెద్దగా సమస్య రాకపోవచ్ఛు సోమశిల కనిష్ఠ వరద ప్రవాహం 23 టీఎంసీలు. కండలేరుకు స్థానికంగా అందుబాటులోకి వచ్చే నీరు 3 టీఎంసీలు మాత్రమే. కనిష్ఠ వరద ప్రవాహం నమోదైన సమయంలో శ్రీశైలం జలాలతో ఆ కొరతను పూడ్చుతారు. రెండు జిల్లాల నేపథ్యంలో హక్కుల సమస్య వస్తే.. మొదటి ప్రాధాన్యం తెలుగుగంగ పథకానికే ఉంటుందని, ఈ స్థితి జిల్లాల సాగునీటి వినియోగంలో రైతుల మధ్య అసమానతలు, పోరాటాలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నిక్షేపంగా ఉన్న సాగునీటి పంపిణీ విధానాలు జిల్లాల పునర్విభజన పుణ్యమా అని సమస్యలు ఎదుర్కోనున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాల విభజన తీరు రైతులకు ఆందోళన కలిగిస్తోంది.
సోమశిల జలాశయం.. జిల్లాల విభజన తర్వాతా ఈ జలనిధి నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది. మొత్తం ఎనిమిది లక్షల ఎకరాల అవసరాలు తీర్చుతుండగా- అందులో ఇప్పుడు మూడు లక్షల ఎకరాలు శ్రీబాలాజీ జిల్లా పరిధిలోకి పోనుంది. జలాశయం ప్రధాన కట్టడం, నీటి విడుదల నియంత్రణ వ్యవస్థలు జిల్లా పరిధిలోనే ఉంటాయి.
ఇది కండలేరు వరద కాలువ. దీని నుంచే మూడో కి.మీ. ప్రాంతంలో దక్షిణ కాలువ విడిపోతుంది. ఈ రెండు కాలువలు మొత్తం నూతనంగా ఏర్పడనున్న తిరుపతి జిల్లా పరిధిలోకి వెళతాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి సమస్యలు జటిలమవుతాయేమోనన్న మాట వ్యక్తమవుతోంది.
ఈ చిత్రంలోనిది కండలేరు జలాశయం.. మొత్తం తిరుపతి నియోజకవర్గం పరిధిలోకి వెళుతుండగా- అభివృద్ధి చెందాల్సిన పలు కాలువలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రతి సమస్యకు తిరుపతి వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనన్నది రైతుల ఆందోళన.
‘సోమశిల సామర్థ్యం 78 టీఎంసీలు, కండలేరు జలాశయం సామర్థ్యం 68 టీఎంసీలు. వరదల కాలంలో ఈ రెండింటికి నీటి పంపిణీ ఇప్పటి వరకు సమన్వయంతో సాగేది. ఒకే జిల్లా పరిధిలో ఉండటంతో ఇప్పటి వరకు సమస్య ఉత్పన్నం కాలేదు. పరిధి మార్పు నేపథ్యంలో నాయకులు ప్రభావం చూపితే.. నీటి నిర్వహణ తీరు మారడం సహజమే. అదే నెలకొంటే.. తాము సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.’
భవిష్యత్తులో సమస్యలు - రాపూరు సుందరరామిరెడ్డి, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు
సోమశిల జలాశయం దక్షిణ కాలువ పరిధిలోని కలువాయి మండలం తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లడం ఇబ్బందే. దీని ద్వారా సాగునీటి పంపిణీలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కండలేరు జలాశయం పరిధిలోని జిల్లా రైతులకూ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం