logo

నూతన జిల్లాలతో అభివృద్ధికి నాంది

నూతన జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధిపథంలో ముందుకు సాగేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే

Published : 28 Jan 2022 01:17 IST
ఎంపీ గురుమూర్తి

మాట్లాడుతున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, దేవసేనమ్మ

గూడూరుపట్టణం, న్యూస్‌టుడే : నూతన జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధిపథంలో ముందుకు సాగేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌ పొణకా దేవసేనమ్మ, వైకాపా నాయకులతో కలిసి గురువారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలుపుతూ శ్రీ బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. నూతన జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు కోడూరు మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని