బుడంగుంటలో భూ దందా
కావలి పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతం బుడంగుంటకు స్పందన వినతుల విచారణలో భాగంగా వెళ్లిన కావలి ఆర్డీవో వి.కె.శీనానాయక్, తహసీల్దారు మాధవరెడ్డి అవాక్కయ్యారు. అక్కడి భూములను సొంత జాగీరుగా పంచేసుకోగా- విచారణ సందర్భంగా ఆర్డీవోకు స్థానికుల నుంచి వచ్చిన ఫి
కావలి, న్యూస్టుడే: కావలి పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతం బుడంగుంటకు స్పందన వినతుల విచారణలో భాగంగా వెళ్లిన కావలి ఆర్డీవో వి.కె.శీనానాయక్, తహసీల్దారు మాధవరెడ్డి అవాక్కయ్యారు. అక్కడి భూములను సొంత జాగీరుగా పంచేసుకోగా- విచారణ సందర్భంగా ఆర్డీవోకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు అనేకం.. ఆరా తీస్తుంటే రెవెన్యూశాఖకు చెందిన వారే ఉండటం.. కుటుంబ సభ్యుల పేరిట వారే అక్రమాలకు పాల్పడటం తేటతెల్లమైంది. విచారణతో ఎక్కడ పట్టుబడతామోనని.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ వీఆర్వో ఆకస్మిక సెలవుపై వెళ్లడం పరిస్థితికి అద్దం పట్టింది. దీంతో ఈ అక్రమాల తంతును తేల్చేందుకు అయిదుగురు వీఆర్వోలతో ఓ విచారణ బృందాన్ని నియమించారు.
ఇలా వెలుగులోకి... ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సినవారే వాటిపై కన్నేశారు. కావలి పురపాలిక పరిధిలో జాగాల కబళింపే ధ్యేయంగా సాగుతున్నారు. ఆపై ఏకంగా ఆక్రమిత స్థలాలను చట్టబద్ధంగా సొంతం చేసుకోవాలనే పన్నాగంతో పెట్రేగిపోతున్నారు. వీరి ఆగడాలపై కలెక్టరేట్లో జరిగే స్పందనకు ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తాయి. మండల, డివిజన్ స్థాయిలో కాకుండా.. బాధితులు కలెక్టరేట్ వరకు వ్యయప్రయాసలకు ఓర్చి వెళుతుండంతో విస్తుబోయారు. తీరా చూస్తే.. ఓ పెద్ద భూ కుంభకోణం వెలుగు చూస్తోంది.
అడ్డగోలుగా... రెవెన్యూ రికార్డులు చేతుల్లో పెట్టుకుని ట్యాంపరింగ్ చేయడం.. కార్యాలయంలో ఉన్న రికార్డులు తారుమారు చేయకున్నా.. పాత తహసీల్దార్ల సంతకాలతో ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం.. వాటి ఆధారంగా కోర్టుల్లో కేసులు వేసి.. బాధితులను ఉక్కిరిబిక్కిరి చేసి.. అందిన కాడికి రాబట్టుకోవడం ఇక్కడ కొందరికి పరిపాటిగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకుగా ఉండి.. ఎవరికీ కేటాయించని జాగాలను ఎంచక్కా క్షేత్ర స్థాయిలో చేతులు మారడం నిత్యకృత్యమైంది. సర్కారీ జాగా కనిపిస్తే కబళించి.. ధ్రువీకరణలు తెచ్చుకోవడం సాధారణమైంది. ప్రస్తుత విచారణతో అయినా ఇలాంటి అవకతవకలకు అడ్డుకట్ట పడాలన్న ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది.
స్పందన వినతులతో... - వి.కె.శీనానాయక్, కావలి ఆర్డీవో
కొంత మంది మహిళలు వరసగా మూడు వారాల పాటు కలెక్టరేట్లో జరిగే స్పందనలో వినతులు అందించారు. స్థానికంగా తమ వద్దకు రాకుండా నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లడం ఏమిటా అనిపించింది. విచారణ చేపడితే.. దొంగ పట్టాల వ్యవహారాలు, పాత తహసీల్దార్ల సంతకాలతో అక్రమాలకు పాల్పడటంతో పాటు అనే విషయాలు వెలుగు చూశాయి. ఆ ముఠా ఆగడాలు నిలువరిస్తాం. బుడంగుంటలో ఖాళీ ప్లాట్లన్నీ స్వాధీనం చేసుకున్నాం. వాటిలో ఎవరూ అడుగుపెట్టరాదు.. విచారణ పూర్తయ్యే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!