logo

24న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ రాక

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న జిల్లాకు రానున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 24వ తేదీ ఉదయం హెలికాఫ్టర్‌ ద్వారా వెంకటాచలంకు ఉదయం 11:45 గంటలకు వస్తారు. అక్కడ విక్రమ సింహపురి యూ

Published : 20 May 2022 01:44 IST

నెల్లూరు(సంక్షేమం), న్యూస్‌టుడే: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న జిల్లాకు రానున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 24వ తేదీ ఉదయం హెలికాఫ్టర్‌ ద్వారా వెంకటాచలంకు ఉదయం 11:45 గంటలకు వస్తారు. అక్కడ విక్రమ సింహపురి యూనివర్సిటీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నెల్లూరులోని రెడ్‌ క్రాస్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి 2:30 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 3:40 గంటలకు పోలీసు కవాతు మైదానం నుంచి తిరిగి విజయవాడకు పయనమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని