నిధులున్నా.. నిస్తేజం!
‘నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం కొండ్లపూడి గ్రామంలో చిన్నపాటి గుంతలకు ప్యాచ్ పనులు చేయించాలన్నా.. బిల్లులు సకాలంలో రావంటూ గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి. బోర్ల మరమ్మతులకూ అదే దుస్థితి. స్థానిక పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలించడం లేదు.ఇక కావలి మండలం చెంచుగానిపాళెంలో బోర్లు
ఆగిన బిల్లులతో కదలని పనులు
విడవలూరు పరిధిలో గోతులు తేలిన మట్టిరోడ్డు
‘నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం కొండ్లపూడి గ్రామంలో చిన్నపాటి గుంతలకు ప్యాచ్ పనులు చేయించాలన్నా.. బిల్లులు సకాలంలో రావంటూ గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి. బోర్ల మరమ్మతులకూ అదే దుస్థితి. స్థానిక పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలించడం లేదు.ఇక కావలి మండలం చెంచుగానిపాళెంలో బోర్లు పనిచేయకున్నా.. నిధులు లేక పరిష్కరించేవారు కరవయ్యారు.’
నెల్లూరు(జడ్పీ), న్యూస్టుడే : ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన(పీఎంజీఎస్వై)కు జిల్లా ఎంపికైందని సంతోషించారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో ఈ పథకం ద్వారా కొద్దిపాటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని భావించారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న 72 గ్రామాలను మొదటి విడత గుర్తించి.. అక్కడి సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపగా- దాదాపు రూ. 14కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షల చొప్పున కేటాయించారు.
ఆశ: ప్రతిపాదిత గ్రామాల్లో.. పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యంలో 380 పనులు మంజూరు చేశారు. రూ. అయిదు లక్షల్లోపు వాటిని నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. పంచాయతీరాజ్ లెక్కల ప్రకారం.. వాటిలో 116 పూర్తి చేశారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో స్థానిక సర్పంచులు అప్పోసప్పో చేసి.. రూ. 3.99 కోట్ల విలువైన పనులు చేయించారు. చిన్నపాటి పనులే కదా! బిల్లులు త్వరగా వస్తాయని భావించారు.
నిరాశ: పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులు జడ్పీ నుంచి కంప్యూటర్ ద్వారా అప్లోడ్ అయినా.. సీఎఫ్ఎంఎస్లోకి వెళ్లడంతో.. అసలు బిల్లులు కంప్యూటర్లో కనిపించడం లేదని అధికారలు చేతులెత్తేశారు. ఇటీవల జడ్పీ సమావేశంలో ఈ విషయమై జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్ అధికారులను నిలదీసినా ఫలితం లేకపోయింది. తమకొచ్చిన ప్రతి బిల్లును వెంటనే పరిశీలించి.. రాష్ట్ర ఆర్థిక అధికారులకు పంపించామని.. తమ పాత్ర అంతటితో పూర్తయిందని స్పష్టం చేశారు. మరోవైపు మంజూరైన నిధులున్నా.. బిల్లులు సకాలంలో రాని నేపథ్యంలో.. మిగిలిన పనులను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గుర్తించిన పలు సమస్యలు అలాగే వెక్కిరిస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
చిన్న చిన్న సమస్యలు.. చికాకు పెడుతున్నాయి. దళితవాడల్లో మోటార్లు, రోడ్లు, బోర్ల మరమ్మతులూ కరవై ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి. అలాగని నిధులు లేవా అంటే.. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద మంజూరైన రూ. 14కోట్లు మూలుగుతున్నాయి. చిక్కల్లా.. ఇప్పటికే ఈ పథకం కింద చేపట్టిన 116 పనులకు సంబంధించిన రూ. 3.99 కోట్ల బిల్లులు అతీగతీ లేకపోవడమే. దీంతో నిధులున్నా.. బిల్లులు రావన్న ఉద్దేశంతో ఆయా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
లేఖరాశాం.. బిల్లులొస్తాయి.. - వాణి, జడ్పీ ఇన్ఛార్జి సీఈవో
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా చేసిన పనులకు సంబంధించిన రూ. 3.99 కోట్ల బిల్లులు ఆగిన విషయాన్ని జడ్పీటీసీ సభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జిల్లా అధికారులపరంగా ప్రక్రియ అంతా పూర్తి చేశాం. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు లేఖలు రాశాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తప్పక బిల్లులన్ని వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్