క్షేత్రంలో డ్రోన్ దళం
సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం డ్రోన్ దళాన్ని వినియోగిస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదర్చుకోగా.. ప్రస్తుతం ప్రక్రియ జరుగుతోంది. ముందుగా గ్రామాల్లో బెంచి మార్కులు ఏర్పాటు చేస్తారు. వా
ఆకాశంలోకి డ్రోన్ను ఎగరవేస్తున్న సిబ్బంది
చేజర్ల, కందుకూరు పట్టణం, న్యూస్టుడే: సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం డ్రోన్ దళాన్ని వినియోగిస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదర్చుకోగా.. ప్రస్తుతం ప్రక్రియ జరుగుతోంది. ముందుగా గ్రామాల్లో బెంచి మార్కులు ఏర్పాటు చేస్తారు. వాటిని సమన్వయం చేస్తూ డ్రోన్ దళం రోజుకు ఆరు వేల ఎకరాల భూమిని సర్వే చేస్తుంది. చిన్న విమానాలను పోలి.. ఆరు కిలోల బరువున్న ఈ డ్రోన్లు.. రెండు వందల మీటర్ల ఎత్తుకు చేరి.. రెండు గంటలపాటు ఆకాశంలో నిర్విరామంగా ఎగురుతూ భూముల చిత్రాలు సేకరిస్తాయి. ఒక్కోటి.. 1400 ఎకరాల వివరాలను కెమెరాల ద్వారా నిక్షిప్తం చేస్తాయి. గ్రౌండ్ కంట్రోల్ యూనిట్ సభ్యులు వాటిని నియంత్రిస్తూ వివరాలు సేకరిస్తారు. గురువారం చిత్తలూరులో డ్రోన్ సర్వే జరుగుతుండగా.. స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
పకడ్బందీగా ప్రక్రియ.. వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీసర్వే పక్కాగా సాగాలని ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ఆదేశించారు. కందుకూరు డివిజన్లోని మండల, గ్రామ సర్వేయర్లతో గురువారం ఆయన ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఆర్ ప్రకారం భూముల రకాలు, వాటి సర్వే నంబర్ల వారీగా గుర్తించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసేటప్పుడు రికార్డుల్లో ఏముంది. భూముల సాగులో ఎవరున్నారు అన్న వివరాలు పరిశీలించి నమోదు చేయాలన్నారు. ప్రక్రియ ప్రారంభించే ముందు గ్రామంలో అందరికీ తెలపాలని, నిర్దేశిత గడువులోగా రికార్డుల ఆధునికీకరణ జరగాలని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.