పొర్లుకట్ట ..పనులు పట్టవే ఎట్టా?
రుతు పవనాల రాకపై వాతావరణశాఖ ప్రకటన రైతుల్లో ఆనందం నింపుతున్నా.. అదే సమయంలో గతం మిగిల్చిన గాయాలు.. జిల్లాలోని పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు సోమశిల రక్షణ కట్టడాల పనుల్లో వేగం పెరగాల్సిన అవసరం ఉండగా- మరోవైపు జలవనరుల శాఖ పర్యవేక్షణలో రూ. 17కోట్ల విలువైన పొర్లుకట్ట మరమ్మతుల తీరు
రుతు పవనాల రాకపై వాతావరణశాఖ ప్రకటన రైతుల్లో ఆనందం నింపుతున్నా.. అదే సమయంలో గతం మిగిల్చిన గాయాలు.. జిల్లాలోని పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు సోమశిల రక్షణ కట్టడాల పనుల్లో వేగం పెరగాల్సిన అవసరం ఉండగా- మరోవైపు జలవనరుల శాఖ పర్యవేక్షణలో రూ. 17కోట్ల విలువైన పొర్లుకట్ట మరమ్మతుల తీరు వారిని ఆలోచనలో పడేస్తున్నాయి. పనులు జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో నాణ్యత తీరుపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దృష్టి సారించడంతో పాటు పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. - న్యూస్టుడే, ఆత్మకూరు
జిల్లాలో పెన్నానది 110 కి.మీ. ప్రవహిస్తుండగా- సోమశిల నుంచి సముద్రం వరకు ఇరువైపులా ఉన్న మండలాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో బ్రిటీష్ కాలంలోనే పొర్లుకట్టలు నిర్మించారు. క్రమేపీ వాటిని ధ్వంసం చేశారు. కొందరు సమీప పొలాల్లో కలుపుకోగా.. మరికొందరు ఇసుక అక్రమ తరలింపునకు నాశనం చేశారు. గత వరదలకు సోమశిల నుంచి 5.5 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా- పొర్లుకట్టలకు గండ్లు పడ్డాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నష్టాల పరిశీలనకు వచ్చిన సీఎం.. రూ. 120 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వరద మరమ్మతుల పేరుతో పనులు చేపడుతున్నారు.
అనంతసాగరం మండలం కచేరిదేవరాయపల్లి వద్ద గత వరదలకు పొర్లుకట్టలు దెబ్బతినగా- మరమ్మతులకు వినియోగిస్తున్న మట్టి ఇది. సమీపంలోని చౌడుమట్టిని పనుల్లో వినియోగిస్తున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పొరలా ఎర్ర మరం తోలి చక్కగా ఉందనిపించారు.
ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో నిర్మిస్తున్న పొర్లుకట్ట ఇది. ఈ పనుల నాణ్యతపై రైతులు అభ్యంతరం తెలిపారు. అయినా.. మార్పు రాకపోవడంతో అడ్డుకున్నారు. సమీపంలోని ఇసుక మట్టిని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మాత్రం అది చెరువు మట్టి అంటున్నా.. నీరు ఉన్న కారణంగా చెరువులో అసలు మట్టి తీయలేని పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం.
ఇసుక తరలింపు ట్రాక్టర్లు, లారీలు వెళ్లేందుకు వీలుగా విడవలూరు మండలం ముదివర్తి వద్ద గుత్తేదారుడు పొర్లుకట్టకు గండికొట్టడంతో రైతులు ఆందోళన చేపట్టిన దృశ్యమిది. ఇక్కడ కట్ట పూర్తిగా ఛిద్రమైంది. అయినా అధికారులు పట్టించుకోలేదు. మరమ్మతులకు నిధులు మంజూరైనా.. ఇంకా పనులు చేపట్టలేదు.
వెంగంనాయుడుపల్లి సమీపంలోని పొర్లుకట్ట ఇది. దీనికి ఓ వైపు రేవూరు, మరోవైపు మినగల్లు ఏటికాలువలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యనున్న పొర్లుకట్ట స్థలాన్ని పొలంగా మార్చాలని కొందరు తవ్వి పూర్తిగా చదువు చేస్తున్నారు. అధికారులు అటువైపు చూసింది లేదు.
నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
పొర్లుకట్టల పనులు పటిష్ఠంగానే చేస్తున్నారు. చెరువు మట్టిని తోలుతున్నారు. ఈ విషయంలో రైతులు అపోహ పడుతున్నారు. నేను వెళ్లి ముదివర్తిపాళెం పనులు పరిశీలించాను. పటిష్ఠంగానే చేస్తున్నారు. నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. - కృష్ణమోహన్, జలవనరులశాఖ ఎస్ఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.