రైళ్ల పరుగుకు అంతరాయం
వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి రైళ్ల పరుగుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్కుమార్ జైన్ ప్రత్యేక రైలులో ఈ ప్రాంతంలో పర్యటించనుండటంతో అధికారులు ఆగమేఘాలపై పరిస్థితిని చక్కదిద్దారు. అప్పటికే వివి
రికార్డులు పరిశీలిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్
బిట్రగుంట, నెల్లూరు (రైల్వే స్టేషన్), న్యూస్టుడే: వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి రైళ్ల పరుగుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్కుమార్ జైన్ ప్రత్యేక రైలులో ఈ ప్రాంతంలో పర్యటించనుండటంతో అధికారులు ఆగమేఘాలపై పరిస్థితిని చక్కదిద్దారు. అప్పటికే వివిధ రైల్వేస్టేషన్లలో ఎగువ, దిగువ మార్గాల్లో వెళ్లే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, మెము రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ రైల్వే మెము, రాజధాని, పూరి, కొల్లాం తదితరాలు ఒక్కొక్కటి అరగంట పైనే ఆలస్యంగా నడిచాయి. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో స్టేషన్ అధికారుల లిఖితపూర్వక ఉత్తర్వులు అందుకుని నడిపారు.
జీఎం తనిఖీలు... దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ శనివారం కృష్ణపట్నం నుంచి విజయవాడ వరకు ప్రధాన రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. కృష్ణపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. నెల్లూరు రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. త్వరలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అన్ని చర్యలు పూర్తయ్యాయన్నారు. వాటి కారణంగా ప్రయాణికులకు ఎలాంఇట అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పడుగుపాడు గూడ్స్ షెడ్ను సందర్శించిన అనంతరం.. బిట్రగుంటకు చేరుకున్నారు. డ్రైవర్లు, గార్డులు, క్రూకంట్రోల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి.. విధులపై ఆరా తీశారు. మూడో లైన్ పనితీరును గమనించారు. శ్రీవెంకటేశ్వరపాళెం, ఒంగోలు, బాపట్ల రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు. మూడోలైను పనులు, ట్రాక్ పటిష్ఠతను తన ప్రత్యేక రైలు నుంచే గమనించారు. ఆయన వెంట విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజరు సీవేంద్ర మోహన్, వివిధ విభాగాల జోనల్, డివిజన్ అధికారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.