ప్రభుత్వ స్థలం... సర్కారుకే అద్దెకు
పెన్నా పొర్లుకట్టలు... ఆర్అండ్బి రోడ్డు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీ నాయకుడి కన్నుపడింది. అనుకున్నదే తడవుగా గదుల నిర్మాణం చేపట్టారు. ఏకంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణానికి అద్దెకిచ్ఛి.. ప్రతి నెలా నగదు వసూలు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు
అక్రమ నిర్మాణాలతో రూ.7.20 లక్షల వసూళ్లు
ప్రభుత్వ స్థలంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణం
పెన్నా పొర్లుకట్టలు... ఆర్అండ్బి రోడ్డు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీ నాయకుడి కన్నుపడింది. అనుకున్నదే తడవుగా గదుల నిర్మాణం చేపట్టారు. ఏకంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణానికి అద్దెకిచ్ఛి.. ప్రతి నెలా నగదు వసూలు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు అక్రమ నిర్మాణం చేపట్టగా.. విషయం తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.
న్యూస్టుడే, ఇందుకూరుపేట : ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం గ్రామ పొలిమేర్లలో రోడ్డుకు ఉత్తరం వైపున పెన్నా పొర్లు కట్టలున్నాయి. పంట కాలువ ఉండగా... ఆ పక్కనే ముదివర్తిపాళెం- పల్లెపాడు ప్రధాన రెండు వరుసల ప్రధాన రోడ్డు ఉంది. పంట కాలువకు, ఆర్అండ్బి రోడ్డుకు మధ్య ప్రభుత్వ స్థలంపై నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడి కన్నుపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహించేందుకు గదులు కావాలని అన్వేషిస్తుండగా... సదరు నాయకుడు ఈ స్థలం నాదని గదులు నిర్మించి ఇస్తానని చెప్పాడు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు అంగీకరించారు. ఒక గదిని మద్యం దుకాణానికి, మరొక గదిని శీతల పానీయాల విక్రయాలకు అద్దెకిచ్చాడు. ఆక్రమణలపై గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. మద్యం దుకాణం నిర్వహణకు ఒక గది అద్దెకివ్వగా ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.14 వేలు, శీతల పానియాల దుకాణం నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.24 వేలు వసూలు చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఏకంగా రూ.7.20 లక్షలు అద్దె తీసుకున్నాడు.
అధికారులు ఏమంటున్నారంటే...?
దుకాణం పంటకాలువ, ఆర్అండ్బి రోడ్డు మధ్యన ఉందని, ఈ స్థలం ఇరిగేషన్, ఆర్అండ్బి శాఖలకు సంబంధించిందని, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణమని తేలితే గదులను తొలగిస్తామని నీటిపారుదల శాఖ ఏఈ విజయ్భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... విషయం మా దృష్టికి రాలేదని, విచారణ జరిపి ప్రభుత్వస్థలంలో ఉంటే మరొక చోటుకు మారుస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.