logo

పదో తరగతి మూల్యాంకనంలో ఉపాధ్యాయుడి హఠాన్మరణం

పదో తరగతి మూల్యాంకనంలో చీఫ్‌ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు టి.కృష్ణ (52) శనివారం హఠాన్మరణం చెందారు. ఆయన చిల్లకూరు మండలం తిక్కవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ బయాలజీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దర్గామిట్ట

Published : 22 May 2022 08:44 IST

 

నెల్లూరు (విద్య) : పదో తరగతి మూల్యాంకనంలో చీఫ్‌ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు టి.కృష్ణ (52) శనివారం హఠాన్మరణం చెందారు. ఆయన చిల్లకూరు మండలం తిక్కవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ బయాలజీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దర్గామిట్ట సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలలో స్పాట్‌ వాల్యుయేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం విధులకు హాజరైన ఆయన.. పేపర్లను పరిశీలించే క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలారు. సిబ్బంది ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో అప్పటికే మృతిచెందారని ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని