గిరిలో గుట్టుగా తవ్వకాలు!
ఉదయగిరి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గుట్టుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన వ్యక్తులను, ఆధునాతన యంత్రాలను తీసుకొచ్చి వాటి ద్వారా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తవ్వకాలకు వెళుతూ విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందిన కృష్ణయ్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (పాత చిత్రం)
న్యూస్టుడే, ఉదయగిరి, దుత్తలూరు ఉదయగిరి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గుట్టుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన వ్యక్తులను, ఆధునాతన యంత్రాలను తీసుకొచ్చి వాటి ద్వారా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల ప్రాంగణాలు, రాజుల కాలంలో నిర్మాణాలు చేసిన చెరువులతోపాటు పురాతన ఆనవాళ్లున్న ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. కరోనా తరువాత స్తబ్బుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల మళ్లీ జోరందుకుంది. గుప్త నిధుల తవ్వకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నా ఆ ముఠా మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఉదయగిరి ప్రాంతంలో పూర్వం అనేక రాజ వంశస్థులతో పాటు నవాబుల పాలనలో ఆలయాలు, మసీదులు, చెరువులు నిర్మించారు. ఐతే ఆలయాలు, మసీదుల్లో అప్పట్లో రాజులు బంగారం దాచి ఉంచి అందుకు గుర్తులను సైతం పెట్టారనే అపోహలతో గుప్త నిధుల ముఠా పురాతన ఆనవాళ్లు ఎక్కడ కనిపించినా గుట్టుగా గుల్ల చేస్తున్నారు.
ప్రలోభాలకు మోసపోవద్దు : గిరిబాబు, సీఐ ఉదయగిరి
గుప్త నిధుల తవ్వకాలు జరగకుండా నిత్యం సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. ఇటీవల గుప్త నిధుల తవ్వకాలు కోసం వెళుతూ ఒక వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపాం. వారి వద్ద నుంచి మెటల్ డిటెక్టరును స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం గుప్త నిధుల తవ్వకాల తగ్గాయి. కొన్ని ముఠాల ప్రలోభాలకు ఎవరూ మోసపోవద్దు. గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రజలు సమాచారమందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం.
*ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ముఠాతో కలిసి పరికరాలతో గుప్త నిధుల తవ్వకాల కోసం సర్వరాబాద్ సమీపంలోని అటవీ ప్రాంతానికి రాత్రి వేళల్లో వెళుతూ దారికి అడ్డంగా ఉన్న విద్యుత్తు తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
* ఉదయగిరి- బండగానిపల్లి మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ఇనుప రాడ్లతో దుర్గం కొండ పరిసర ప్రాంతాల్లోకి వెళుతూ స్థానికులకు కనిపించారు. వారు ఎందుకొచ్చారో తెలియక పల్లె ప్రజలు పోలీసులు, అటవీశాఖాధికారులకు సమాచారమివ్వడంతో వారు గాలిస్తున్నారు.
కొందరు బృందాలుగా ఏర్పడి... బీ ఉదయగిరి కొండపై ఏదో ఒక వైపు గుప్త నిధుల కోసం కొందరు బృందాలుగా ఏర్పడి రాత్రి సమయాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పలుమార్లు స్థానికులు కొండపై జరుగుతున్న గుప్త నిధుల తవ్వకాల విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.* ఉదయగిరి పట్టణంలోని రంగనాయకులస్వామి ఆలయంలోని గర్భ గుడి ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గోడలకు రంధ్రాలు వేశారు. * ఉదయగిరి పట్టణంలోని కృష్ణ మందిరంలో పురాతన కల్యాణ వేదిక వద్ద గుప్త నిధుల కోసం యంత్రాలతో పెకలించారు. రాతి స్తంభాలకు రంధ్రాలు వేశారు. * ఉదయగిరి పెద్ద చెరువు అలుగు వద్ద, సీతారామపురం మండలం విఠలేశ్వస్వామి ఆలయం సమీపంలోని స్వామి చెరువు, వరికుంటపాడు మండలం కనియంపాడు చెరువుల వద్ద తవ్వకాలు జరిగాయి. * ఉదయగిరి మండలం గుడినరవలో పురాతన నంది విగ్రహాన్ని కొన్నేళ్ల క్రితం చోరీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు