logo

అదృశ్యమైన అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ మృతి

అదృశ్యమైన యువకుడు శవమై కనిపించాడు. అతను కలిగిరి మండలంలోని చిన్నఅన్నలూరుకు చెందిన అసిస్టెంట్‌ లైన్‌మేన్‌ ధనుంజయ్‌ (39)గా పోలీసులు గుర్తించారు. సూళ్లూరుపేటకు చెందిన ధనుంజయ్‌ చిన్నఅన్నలూరు అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు.

Published : 26 May 2022 03:22 IST

కలిగిరి, న్యూస్‌టుడే: అదృశ్యమైన యువకుడు శవమై కనిపించాడు. అతను కలిగిరి మండలంలోని చిన్నఅన్నలూరుకు చెందిన అసిస్టెంట్‌ లైన్‌మేన్‌ ధనుంజయ్‌ (39)గా పోలీసులు గుర్తించారు. సూళ్లూరుపేటకు చెందిన ధనుంజయ్‌ చిన్నఅన్నలూరు అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై నిర్మానుష్య ప్రాంతాల్లో ఒక్కడే తాగుతుండేవాడు. గత నెల 15వ తేదీ నుంచి కనిపించడం లేదని భార్య కవిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కలిగిరి మండలం పోలంపాడు- కమ్మవారిపాలెం పొలాల్లో మృతదేహాన్ని గుర్తించినట్లు కొందరు రైతులు బుధవారం సమాచారం అందించారు. పరిశీలించిన సీఐ సాంబశివరావు, ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి లభించిన ఆధారాలతో ధనుంజయ్‌గా గుర్తించారు. విద్యుత్తు ఏడీఏ బాపిరెడ్డి, ఏఈ దినేష్‌ సంఘటనా స్థలాన్ని  పరిశీలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని