దినసరి కార్మికులకు ఉద్వాసన?
కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేశారు. విషమ పరిస్థితులు ఎదురైనా విధులు నిర్వహించారు. అప్పట్లో అదనంగా కార్మికులు అవసరమని 70 మంది వరకు నియమించారు. వీరు దినసరి వేతనాలతో పనిచేస్తున్నారు.
మురుగు కాలువలో పూడిక తొలగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది
కావలి, న్యూస్టుడే: కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేశారు. విషమ పరిస్థితులు ఎదురైనా విధులు నిర్వహించారు. అప్పట్లో అదనంగా కార్మికులు అవసరమని 70 మంది వరకు నియమించారు. వీరు దినసరి వేతనాలతో పనిచేస్తున్నారు. నెలకు 26 పనిదినాలుగా నిర్దేశిస్తూ రూ.10,400 వంతున నాటి నుంచి చెల్లిస్తున్నారు. వీరికి ఉద్వాసన పలికేందుకు పురపాలక సంఘం సమాయత్తమైంది. కొందరిని ఇప్పటికే రాజకీయ సిఫార్సులతో పారిశుద్ధ్య విభాగం కాకుండా ఇతర విధులకు మళ్లించుకున్నారు. రెండు రోజులుగా వీరు విధులకు హాజరవుతున్నా, ఎన్ఎంఆర్లో (నామినల్ మస్టర్ రోళ్లలో) నమోదు చేయకపోవడంతో అలజడి రేగింది. ఈ విషయమై సమాచారం తెలియగానే సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సీపీఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య అధికారులతో చర్చలు జరిపారు. అయినా, వీరందరినీ ఆర్థికంగా మోయలేని స్థితితో తొలగిస్తున్నామనేది అధికారుల వాదన.
ఆదాయ వనరులపై దృష్టి ఏదీ ?: పురపాలకానికి వచ్చే ఆదాయ వనరులు దారి తప్పుతున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రణాళికా విభాగాన్ని సంస్కరించాలని సర్వత్రా కోరుతున్నారు. ఈ విభాగం ద్వారా వచ్చే ఆదాయంతో పుర కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల సర్దుబాటు పెద్ద సమస్య కాదు. వివిధ ఆదాయ వనరులను పక్కదారి పట్టిస్తున్నారు. ఆస్తి పన్ను వసూళ్లలోనూ అనేక ఆరోపణలున్నాయి. అసెస్మెంట్ల వైశాల్యం, నిర్మాణ తరహా, వాణిజ్యేతర, తదితర అంశాలు అనుసరించి నిధులు సమీకరించుకోవచ్చు. అలాగాకుండా కేవలం మధ్యతరగతి వర్గాలపైనే గురిపెట్టి నిధులు సమీకరించుకుంటున్నారు. ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను వ్యవహారంలో నిష్పక్షపాత ధోరణి లేదు. కడకు కేవలం ఆర్థిక భారమని కీలక వేళల్లో సేవలు అందించిన వారిని అమానవీయంగా తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నా దృష్టికి రాలేదు
శీనానాయక్, ఆర్డీవో, పుర ప్రత్యేకాధికారి
తాత్కాలికంగా నియమించిన పారిశుద్ధ్య సిబ్బందిని తొలగిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. పుర అధికారులతో విచారించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!