అమ్మ ఒడి.. సంశయాల జడి
ఎప్పటిలా కాదు.. ఈసారి ఎనిమిది అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు అమ్మ ఒడి సాయం అందించేందుకు. రెండేళ్లుగా జనవరిలో ఇచ్చే నిధులు ఈసారి జూన్లో ఇస్తామంటోంది ప్రభుత్వం.. మూడు రోజులు ఉంది మేనెల ముగిసేందుకు.. నేటికీ అర్హుల జాబితా అధికారులకు అందలేదు.
డీఈవో, సర్వశిక్షా అభియాన్ అధికారులకు అందని జాబితా
తల్లిదండ్రుల్లో ఆవేదన
న్యూస్టుడే, నెల్లూరు (విద్య)
తరగతి గదిలో విద్యార్థులు
ఎప్పటిలా కాదు.. ఈసారి ఎనిమిది అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు అమ్మ ఒడి సాయం అందించేందుకు. రెండేళ్లుగా జనవరిలో ఇచ్చే నిధులు ఈసారి జూన్లో ఇస్తామంటోంది ప్రభుత్వం.. మూడు రోజులు ఉంది మేనెల ముగిసేందుకు.. నేటికీ అర్హుల జాబితా అధికారులకు అందలేదు. తమ పిల్లల పేర్లు ఉన్నాయా, లేవా అని ఈనెల మొదటి నుంచి డీఈవో, సర్వశిక్షా అభియాన్ కార్యాలయాల చుట్టూ తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు.. నేటికీ ఆ వివరాలు అందక ఆవేదన చెందుతున్నారు. ఇదేమని అధికారులను అడిగితే.. తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు పడతాయంటున్నారు.
అమ్మఒడి ప్రారంభించిన మొదటి, రెండో సంవత్సరంలో జనవరిలో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యేవి. గతేడాది కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ పథకం అమలు వాయిదా పడింది. జూన్లో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలని నిబంధన విధించింది. రెండేళ్లలో కొవిడ్ కారణంగా విద్యాసంస్థలు సక్రమంగా నిర్వహించకపోవడంతో హాజరులో సడలింపునిచ్చింది. ఈసారి దాన్ని పక్కాగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హులు, అనర్హులను గుర్తింపు ప్రక్రియను గ్రామ, వార్డు వాలంటీర్లు నిర్వహిస్తున్నారు.
విద్యాశాఖాధికారులకే వివరాలు తెలియక..
అమ్మఒడి పథకం ప్రారంభమైన తొలి ఏడాదిలో 2,20,607 మంది, రెండో ఏడాది 2,43,497 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి. ఈ సంవత్సరం జిల్లాలో ఎంత మంది ఖాతాలో జమ కానున్నాయో తెలియడం లేదు. ఈ వివరాలు జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా అభియాన్ అధికారులకే తెలియకపోవడం గమనార్హం. సంబంధిత శాఖలకు ఈ వివరాలు తెలియకపోతే నిధులెలా జమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజులుగా అర్హుల జాబితా వాలంటీర్ల చరవాణిలో కనిపిస్తోంది. ఇప్పటికి రెండుసార్లు అర్హుల జాబితా సమగ్రశిక్షా అభియాన్ ద్వారా ప్రకటించగా ఈసారి ఆ శాఖకూ వివరాలు తెలియక పోవడం గమనార్హం. వీటిని తెలుసుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఇక్కడ అమ్మఒడి వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో సచివాలయ వాలంటీర్ల వద్దకు వెళుతున్నారు. వారి వద్ద కూడా పూర్తి సమాచారం అందకపోవడంతో నిరాశతో తల్లిదండ్రులు వెనుదిరుగుతున్నారు.
విద్యాశాఖకు వివరాలు రాలేదు
- పి.రమేష్, డీఈవో
అమ్మఒడి వివరాలు విద్యాశాఖకు అందలేదు. ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు నేరుగా వారి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. జూన్ మొదటి వారంలో ఇవ్వనుంది.
ఈ అంశాలే కొలమానం..
అమ్మఒడి అర్హులకు సరైన అర్హతలు ఉన్నాయా, లేవా అనే అంశంతో పాటు మరో ఎనిమిది అంశాలను ప్రభుత్వం పరిశీలించనుంది. 75 శాతం హాజరు, 300 యూనిట్లలోపు విద్యుత్తు బిల్లులు, నాలుగు చక్రాల వాహనం, పొలం పరిమితి, తదితర అంశాలున్నాయి. విద్యార్థి, తల్లి ఆధార్, జగనన్న విద్యా దీవెన పొందుతున్నారా, మ్యాపింగ్ నమోదైందా, లేదా అని పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించనున్నారు. ఈసారి అమ్మఒడి పథకం కింద రూ.13 వేలు తల్లుల ఖాతాలో జమకానుంది. మిగతా రూ.2 వేలను మరుగుదొడ్ల నిర్వహణ, ‘నాడు- నేడు’ పనుల ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు.
జిల్లాలోని పాఠశాలలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ