logo

జననేతా నిను మరువగలమా!

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు శనివారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Published : 29 May 2022 01:39 IST

- ఈనాడు, నెల్లూరు

కందుకూరు : ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్‌, నాయకులు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు శనివారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కోసి పంచి పెట్టారు. ఆయన ఆశయాల అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు వాహనాల్లో తరలివెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని