రహదారే అడ్డా ఆయిల్ దందా
జాతీయ రహదారిపై ఆయిల్ మాఫియా రెచ్చిపోతోంది. పోర్టు నుంచి వచ్చే లారీల్లో అక్రమంగా ఆయిల్ను తీసి విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు వత్తాసు పలుకుతుండటంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
జాతీయ రహదారిపై ఆయిల్ మాఫియా రెచ్చిపోతోంది. పోర్టు నుంచి వచ్చే లారీల్లో అక్రమంగా ఆయిల్ను తీసి విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు వత్తాసు పలుకుతుండటంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒకటి, రెండు కాదు వేల లీటర్ల నూను తస్కరిస్తున్నారు. అనంతరం కల్తీ చేయడంతో పాటు.. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. తమిళనాడు, బెంగళూరులకు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ప్రజాధనాన్ని కాజేయడంతో పాటు.. కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.
జిల్లాలోని ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామ పరిధిలో దాదాపు 8 ఇడిబుల్ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. విదేశాల నుంచి నౌకల ద్వారా క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకున్న కంపెనీలు రిఫైనరీ చేసి అయిదు రకాలుగా విభజిస్తాయి. అనంతరం వాటిని వ్యాపారుల అవసరాల మేరకు విక్రయిస్తున్నాయి. వీటిని తరలించడానికి దాదాపు 420 ట్యాంకర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇడిబుల్ ఆయిల్ కంపెనీ నుంచి లోడ్ అయ్యి బయటకు వచ్చిన లారీలో సరకు నేరుగా కొనుగోలుదారుకు చేరడం లేదు. కొందరు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, లారీ డ్రైవర్లు కుమ్మక్కై ట్యాంకర్లో నుంచి నూనెను బయటకు తీసుకున్నారు. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు ప్రాంతాల్లో రహస్య ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని ఈ దందాకు తెర తీస్తున్నారు. ఇదేమిటని అడిగిన స్థానికులపై దాడులకు యత్నిస్తున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ బిస్కట్ కంపెనీకి చెందిన ప్రతినిధి ఈ విషయంపై ట్యాంకర్ల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. తమకు రావాల్సిన నూనెను దొంగిలిస్తున్నారని నిలదీశారు. దాంతో స్థానికంగా ఉండే ఓ నాయకుడు మధ్యవర్తిత్వం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ తంతు ఏళ్ల తరబడి జరుగుతున్నా.. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు.
నెలకు రూ.1.50 కోట్లకు పైగా దోపిడీ
ఇడిబుల్ ఆయిల్ కంపెనీల నుంచి రోజుకు దాదాపుగా 100 ట్యాంకర్ల నుంచి నూనెను ట్రేడర్లకు తరలిస్తుంటారు. వీటిలో కంపెనీలు, ఇతర పరిశ్రమలకు దాదాపు లారీలతో తరలిస్తారు. వీటిలో 20 నుంచి 25 లారీల్లోంచి నిత్యం ఆయిల్ను కాజేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్లో దాదాపు 23 వేల లీటర్లు నూనెను తరలిస్తారు. సాధారణంగా కంపెనీ నిర్వాహకులు ట్యాంకర్కు 60 లీటర్ల నూనెను అదనంగా నింపుతారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆ మొత్తంతో పాటు ఒక్కో లారీ నుంచి దాదాపుగా 200 లీటర్ల నూనెను తీస్తున్నారు. అంటే రోజుకు దాదాపుగా రూ.6 లక్షల విలువైన 5 వేల లీటర్ల నూనెను అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ లెక్కన వారానికి రూ.42 లక్షలు, నెలకు దాదాపు రూ.1.50 కోట్ల విలువైన నూనెను కాజేస్తున్నారు. ఇదంతా ఓ ప్రాంతంలో నిల్వ చేసి.. లారీకి సరిపడా వచ్చాక విక్రయిస్తున్నారు. లేదంటే నెల్లూరు నగరం స్టోన్హౌస్పేటలోని కొందరు ఆయిల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని సమాచారం. దీనిలో బెంగళూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. స్థానికులను పనిలో పెట్టుకుని ఈ దందాను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం - రాజేశ్వర్రెడ్డి, ఎస్పీ, విజిలెన్స్
కంపెనీల నుంచి వెళ్లే రవాణా లారీల్లో అక్రమంగా నూనెను తీసి విక్రయించడం చట్టవిరుద్ధం. దీనిపై నిఘా ఏర్పాటు చేస్తాం. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
కొండూరు సత్రం సమీపంలో ఏర్పాటు చేసిన షెడ్లో ఉంచిన ఆయిల్ క్యాన్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులు
[ 29-03-2024]
నెల్లూరు పట్టణవాసులు, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, లలిత దంపతులు తమ కుమారుడు జై సాయిరామ్ జ్ఞాపకార్థం పేదల ఆకలిని తీరుస్తున్నారు. -
తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి
[ 29-03-2024]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. -
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు