logo

ఎంపీడీవోల బదిలీలు

ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు ఎంపీడీవోలను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులను జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో వాణి శనివారం విడుదల చేశారు. అనుమసముద్రంపేట ఎంపీడీవో వి.రజనీకాంత్‌ను కొండాపురానికి, కొండాపురం ఎంపీడీవో ఎం.బ్రహ్మయ్యను ఏఎస్‌పేటకు బదిలీ చేశారు

Published : 29 May 2022 01:39 IST

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే : ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు ఎంపీడీవోలను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులను జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో వాణి శనివారం విడుదల చేశారు. అనుమసముద్రంపేట ఎంపీడీవో వి.రజనీకాంత్‌ను కొండాపురానికి, కొండాపురం ఎంపీడీవో ఎం.బ్రహ్మయ్యను ఏఎస్‌పేటకు బదిలీ చేశారు. కోవూరు ఎంపీడీవో ఎం.శ్రీహరిని ఆత్మకూరుకు, బోగోలు ఎంపీడీవో నాసర్‌రెడ్డిని అనంతసాగరానికి, అనంతసాగరం ఎంపీడీవో ఎ.మధుసూదనరావును బోగోలుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంగం ఎంపీడీవో కె.నాగేంద్రబాబును టీపీగూడూరుకు, అక్కడ పనిచేస్తున్న హేమలతను సంగానికి బదిలీ చేశారు. వెంటనే వారికి కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని