Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
నెల్లూరు నగరంలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా గుంతలమయం. మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి అడిగితే పట్టించుకునే వారే లేరు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల
నెల్లూరు: నెల్లూరు నగరంలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా గుంతలమయం.. మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి అడిగితే పట్టించుకునే వారే లేరు.. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల గురించి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.. ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. అధికార పార్టీలో ఉన్నప్పటికీ వివిధ సమస్యలపై కోటంరెడ్డి స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన వైకాపా జిల్లా ప్లీనరీ సమావేశంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను శత్రువులుగా భావించి కక్ష సాధింపులకు పాల్పడవద్దని సూచించారు.
మురుగు కాల్వలో దిగి నిరసన
రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం మురుగు కాల్వలో దిగి కోటంరెడ్డి నిరసన తెలిపారు. రైల్వే, నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. తాజాగా ఇవాళ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన భవన్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కోటంరెడ్డి గోడు వెళ్లబోసుకున్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని వావిలేటపాడు జగనన్న లేఅవుట్లో కనీస సౌకర్యాలు కూడా లేవని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. 10 నెలలుగా సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించడం లేదని వాపోయారు. రూరల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటి మరమ్మతులకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిలిచిపోయిన బీసీ భవన్, అంబేడ్కర్ భవన్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు.
బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణరెడ్డి చెప్పారు. అధికారులు చొరవ తీసుకుని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాకు అధికారులు ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో తెలియడం లేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల పనులు చేపట్టామని, పంచాయతీ రోడ్ల పనులు త్వరలోనే చేపడతామని మంత్రి కాకాణి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నామినేషన్లకు ముఖ్యులు
భాజపా లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. -
డీకే అరుణకు రూ.66.75 కోట్ల ఆస్తులు
మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ (అరుంధతి) తన కుటుంబానికి రూ.66.75 కోట్ల విలువైన ఆస్తులు (రూ.26.47 కోట్ల చరాస్తులు, రూ.40.27 కోట్ల స్థిరాస్తులు) ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు: నిరంజన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. -
పీసీసీ అధికార ప్రతినిధులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 28 మందిని కేటాయించింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్