పేరుకే ఆన్లైన్.. పైసా ఇస్తేనే పనుల్
నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారును మరొకరికి విక్రయించారు. దాని యాజమాన్య హక్కులను తన పేరుపై మార్చుకునేందుకు కొనుగోలు చేసిన వ్యక్తి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.
లైసెన్సు మొదలు అన్నింటికీ అదే తీరు
కొత్తరూపు సంతరించుకుంటున్న దళారీ వ్యవస్థ
నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారును మరొకరికి విక్రయించారు. దాని యాజమాన్య హక్కులను తన పేరుపై మార్చుకునేందుకు కొనుగోలు చేసిన వ్యక్తి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ-వాహన్లో వివరాలు నమోదు కాలేదని, బీమా సక్రమంగా లేదని.. ఇలా పలు కారణాలతో రెండుసార్లు తిరస్కరించారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. ఇలా జరుగుతోందేమిటని తెలిసిన వాళ్లను అడగ్గా.. ఓ దళారి నంబరు ఇచ్చారు. అక్కడికి వెళ్లి వివరాలు చెప్పారు. గతంలో పెట్టిన పత్రాలతోనే మళ్లీ దరఖాస్తు చేసి.. రూ. 2,500 ఇచ్చారు. తర్వాత రోజే ఆమోదం పొందడంతో దరఖాస్తుదారుడు అవాక్కయ్యారు.
స్టోన్హౌస్పేటకు చెందిన మరో వ్యక్తి ద్విచక్ర వాహనం, కారు నడిపేందుకు లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నెల్లూరు ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని ఓ సర్వీసు సెంటర్కు వెళ్లారు. అక్కడున్న వ్యక్తి పరీక్ష కష్టంగా ఉంటుంది. వాహనం నడిపే సమయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా.. అధికారులు ఒప్పుకోరని చెప్పారు. దాంతో ఏం చేయాలని అడగ్గా.. రూ. 3వేలు ఇస్తే మొత్తం నేను చూసుకుంటానని చెప్పాడు. గత్యంతరం లేక అడిగినంత ఇచ్చుకున్నారు.
ఈనాడు డిజిటల్, నెల్లూరు
రవాణా కార్యాలయాలకు దళారులు రాకూడదు. అసలు వాళ్లతో పని లేకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి పనులు చేయించుకునే విధానం తీసుకొచ్చాం. మా ఉద్యోగులే సహాయకులుగా అన్ని పనులు చేసి పెడతారు. సీసీ కెమెరా నిఘాలో కార్యాలయం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని.. రుసుములు చెల్లించి.. స్లాట్ తీసుకుని వెళ్లి పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇదీ రవాణాశాఖలో సంస్కరణ గురించి ప్రభుత్వ అధికారులు తరచూ చెప్పే మాట! వాస్తవంలో మాత్రం అక్కడికి దళారీ వ్యవస్థ ఏదో ఒక రూపంలో చొరబడుతూనే ఉంది. వసూళ్ల పర్వానికి ఎక్కడా అడ్డుకట్ట పడకుండా ఉంది. లెర్నింగ్ లైసెన్స్, వాహన సామర్థ్యం.. ఇలా ప్రతి దశలో వాటా పడితేనే పని అన్న స్థితి నెలకొంది. ఆన్లైన్లో చెల్లింపులు చేసినా ఏదో ఒక అడ్డుపుల్ల వేయడం.. అదే దళారి ప్రమేయంతో వెళితే మాత్రం వాహనం నడపడం రాకపోయినా లైసెన్సు చేతులో పడటం ఇక్కడ రివాజుగా మారింది. రవాణా రంగంతో ముడిపడిన వ్యాపారాలను తమ బినామీల ద్వారా శాఖలోని కొందరు ఉద్యోగులే నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రతి సెక్షన్లో ఏజెంట్ కోడ్నో.. పేరో చెప్పందే సిబ్బంది చేయరు. ఒక వేళ నేరుగా దరఖాస్తు చేసినా.. వివిధ కారణాలు చెప్పి పలుమార్లు తిప్పుతుండటంతో ఆ బాధపడలేక ఎంతో కొంత ముట్టజెప్పి పని చేయించుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. జిల్లాలో నెల్లూరు ఉప రవాణా కార్యాలయంతో పాటు కావలి, ఆత్మకూరు, కందుకూరుల్లోనూ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వాహన సామర్థ్యం అంటే పండగే..
పాఠశాల బస్సులు, వ్యాన్ల తనిఖీల సమయంలోనూ నిబంధనలను పట్టించుకోకుండా ధ్రువీకరణలు ఇస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని గనుల నుంచి పరిమితికి మించిన బరువుతో లారీలు తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదు. గడిచిన రెండు నెలల్లో 400కు పైగా కేసులు నమోదు చేసి.. రూ. రెండు కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేశామని అధికారులు చెబుతున్నా.. రీచ్లు, స్టాక్ పాయింట్లు, గ్రావెల్ సరఫరా చేస్తున్న టిప్పర్ల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
అప్పుడు మామూళ్లు.. ఇప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలు
కొత్త వాహనం కొనుగోలు చేశాక.. ఏజెంట్ వద్దకు వెళ్లి.. ఆయన అడిగిన మొత్తం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. అందులోనే రిజిస్ట్రేషన్ రుసుములు, అధికారుల మామూళ్లు, ఏజెంట్ వాటా ఉండేవి. రుసుం ఎంతో? మామూళ్ల మొత్తం ఎంతో తెలిసేదికాదు. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు వాహన డీలరు దగ్గరే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకునే విధానం తీసుకొచ్చారు. కానీ, డీలర్లు గతం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు గగ్గోలుపెడుతున్నారు. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్కు నిబంధనల ప్రకారం చెల్లించేది రూ. 935 మాత్రమే. డీలరు మాత్రం రూ. రెండు వేలుపైనే వసూలు చేస్తున్నారు. ఇంత తీసుకుంటున్నారేమిటి? అని ప్రశ్నిస్తే.. ‘ప్రాసెసింగ్ ఛార్జీలు.. ఇవన్నీ మాకే కాదు.. ఆర్టీఏ వాళ్లకూ ఇవ్వాలి’ అని తేల్చి చెబుతున్నారు. కారుకు రూ.అయిదు వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొందరు డీలర్లు ఆ మొత్తం అధికారులకు చెల్లించకపోవడంతో వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ పెండింగ్లో ఉంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు
రవాణా కార్యాలయంలో ఎక్కడైనా ప్రభుత్వ ఫీజు కన్నా అధికంగా నగదు డిమాండ్ చేస్తే ప్రజలు ప్రశ్నించాలి. ప్రైవేటు వ్యక్తులు, ఏజెంట్లను ఆశ్రయించవద్దు. నేరుగా కార్యాలయంలో పనులు చేసుకోవాలి. జిల్లాలో తమ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చిన వారి నుంచి అదనంగా నగదు డిమాండ్ చేస్తే సహించేది లేదు. డబ్బు ఎందుకివ్వాలని ప్రశ్నించాలి. నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- బి.చందర్, డీటీసీ, నెల్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!