logo

మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు

భాజపా ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ

Published : 02 Oct 2022 02:03 IST

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : భాజపా ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శనివారం నగరంలోని రైల్వేఫీడర్స్‌ రోడ్డులో జనసేనాదళ్‌ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జాతీయ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణకు ప్రజలు సైనికుల్లా పోరాటాలు చేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. దేశాన్ని బ్రిటీషువారి నుంచి ఎలా కాపాడుకున్నామో 2024 ఎన్నికల్లో భాజపాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గసభ్యులు సయ్యద్‌ సిరాజ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మస్తాన్‌, కన్వీనర్‌ మున్నా, మురళీకృష్ణ, మధు, గోపాల్‌, గౌస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని