logo

రేపు స్వర్ణభారత్‌ ట్రస్టు ప్రతిభా పురస్కారాల ప్రదానం

వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఏడాది పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మంగళవారం ట్రస్టులో ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు సమన్వయకర్త జనార్దన్‌రాజు తెలిపారు.

Published : 02 Oct 2022 02:03 IST

వెంకటాచలం : వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఏడాది పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మంగళవారం ట్రస్టులో ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు సమన్వయకర్త జనార్దన్‌రాజు తెలిపారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 64మంది విద్యార్థులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 10గంటలకు వెంకటాచలంలోని ట్రస్టులో జరిగే ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, స్వర్ణభారత్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్ హాజరై విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని