Nellore: ఈల లేదని కానిస్టేబుళ్లకు మెమోలు
నేర నియంత్రణకు ఈల (విజిల్) చక్కగా దోహదపడుతుందని ఎస్పీ సీహెచ్ విజయరావు ఉద్బోధించారు. ఈల పెట్టుకోని ఇద్దరు కానిస్టేబుళ్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. నెల్లూరు సంతపేట పోలీసు స్టేషన్ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తమ వద్ద ఈల ఉందని చూపుతున్న కానిస్టేబుళ్లు
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: నేర నియంత్రణకు ఈల (విజిల్) చక్కగా దోహదపడుతుందని ఎస్పీ సీహెచ్ విజయరావు ఉద్బోధించారు. ఈల పెట్టుకోని ఇద్దరు కానిస్టేబుళ్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. నెల్లూరు సంతపేట పోలీసు స్టేషన్ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి.. సిబ్బంది వివరాలు? ఎవరెవరు విధుల్లో ఉన్నారు? బీట్కు ఎంత మందిని కేటాయిస్తున్నారు? అనే వివరాలు తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే యూనిఫాంతో పాటు విజిల్ పెట్టుకోని వారెందరున్నారని ప్రశ్నించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకురాలేదని గుర్తించి.. దాని ప్రాధాన్యం, ఉపయోగాలను వివరించారు. వారిద్దరికీ మెమో జారీ చేయాలన్నారు. సెట్ కాన్ఫరెన్స్ బుక్ ఎందుకు నిర్వహించడం లేదని ఇన్స్పెక్టర్ అన్వర్బాషాను ప్రశ్నించారు. కేసులపైనా ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క మర్డర్ కేసు కూడా పెండింగ్లో లేదని.. సంతపేట పీఎస్లో మాత్రం ఒక్క హత్య కేసు ఉందన్నారు. వీలైనంత వరకు సత్వరం పరిష్కరించాలన్నారు. రికవరీ సాధనకు కానిస్టేబుళ్లకు లక్ష్యాలు నిర్దేశించాలని, దోపిడీ కేసులను ఎస్సైలకు కేటాయించాలని సూచించారు. ఎస్పీ వస్తున్నారని.. రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయడం కాదని.. సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉండాలని హితవు పలికారు. స్టేషన్లో ఉన్న వాహనాలను పరిశీలించి వేలం వేయాల్సిందిగా సూచించారు. ఎస్పీ వెంట ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి, నగర ఇన్ఛార్జి డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.నాగేశ్వరమ్మ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి
[ 29-03-2024]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. -
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం