జగనన్న కాలనీలో జలగలు
జగనన్న కాలనీలు.. అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూసేకరణ మొదలు.. మెరక చేయడం వరకు పెద్దమొత్తంలోనే దోపిడీ చేసిన కొందరు.. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలోనూ అదే రీతికి తెరదీశారు.
నిర్మాణాలను మధ్యలోనే వదిలేసిన గుత్తేదారులు
నెల్లూరు గ్రామీణంలోని కొండ్లపూడి జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఇళ్లు
జగనన్న కాలనీలు.. అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూసేకరణ మొదలు.. మెరక చేయడం వరకు పెద్దమొత్తంలోనే దోపిడీ చేసిన కొందరు.. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలోనూ అదే రీతికి తెరదీశారు. ప్రభుత్వ ధరకే త్వరితగతిన కట్టిస్తామని చెప్పిన గుత్తేదారులు.. మధ్యలోనే వదిలేస్తున్నారు. బిల్లుల మంజూరులో అధికారులు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా ఊర్లు అవుతాయని గొప్పగా చెబుతున్న కాలనీల్లో శిథిలమైన పిల్లర్లు, మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేపట్టని పేదలపై.. ‘ఇళ్లు కట్టుకోకుంటే పట్టాలు రద్దు చేస్తా’మని ఒత్తిడి చేసిన అధికార యంత్రాంగం.. బాధ్యత తీసుకున్న గుత్తేదారులు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పూర్తి చేయకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: జిల్లాలో 277 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. వీటిలో 72,062 ప్లాట్లు ఉండగా- కేవలం 44,609 మందికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు రూ.802.96 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆప్షన్-3 (ప్రభుత్వమే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి) కింద జిల్లాలో 20,208 మందిని గుర్తించారు. వీరిని 80 గ్రూపులుగా విభజించి.. స్థానికంగా ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చే మేస్త్రీలకు అప్పగించాలనేది మొదట్లో ప్రతిపాదన. దాన్ని పక్కనపెట్టి.. పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. ఎలాంటి టెండరు విధానం లేకుండా రూ.361.89 కోట్ల విలువైన పేదల ఇళ్ల నిర్మాణాన్ని కట్టబెట్టారు. ఇదంతా అధికారులే దగ్గరుండి నడిపించారు. ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ వ్యయం నేరుగా గుత్తేదారుడికి ఇచ్చేందుకు నిబంధనలు అడ్డురావడంతో.. లబ్ధిదారుల ఖాతాల్లో వేసే గుత్తేదారులకు మళ్లిస్తున్నారు. ఇంతా చేసినా.. డిసెంబరు నాటికి 13,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడ్డారు. పురోగతిలో రాష్ట్రంలో 21వ స్థానానికి దిగజారారు.
ఒక్కటి పూర్తిచేస్తే ఒట్టు
సొంతంగా ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు అయిదు దశల్లో నగదు ఇస్తుండగా- గుత్తేదారులకు మరింత వెసులుబాటు కల్పించారు. పిల్లర్లు వేసే దగ్గర నుంచి పూర్తయ్యే వరకు తొమ్మిది దశల్లో ఇస్తున్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.1.80 లక్షలు, ప్రభుత్వం లబ్ధిదారుడికి పావలా వడ్డీకి ఇప్పించే రూ.35వేలను గుత్తేదారులకు అధికారులే దగ్గరుండి అందజేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇళ్ల నిర్మాణం జిల్లాలో శరవేగంగా జరుగుతుందనుకుంటే పొరపాటే. అధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో 4,657 పూర్తయితే.. ఇవన్నీ లబ్ధిదారులు స్వయంగా నిర్మించుకున్నవే. గుత్తేదారులు కనీసం ఒక్కటి కూడా నిర్మించలేదు. ఇదంతా ఒకవైపు అయితే.. ఇప్పటివరకు వీటి కోసం రూ.138 కోట్లు ఖర్చు చేయగా.. గుత్తేదారులకు దాదాపు రూ.73 కోట్లు చెల్లించారు.
జిల్లాలో లేఅవుట్లు 277
పూర్తయినవి 4,657 (ఇవన్నీ లబ్ధిదారులు నిర్మించుకున్నవే)
ఏర్పాటు చేసిన ప్లాట్లు 72,062
మంజూరైన ఇళ్లు 44,609
వెక్కిరిస్తున్న మొండిగోడలు
జిల్లాలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి దాదాపు రెండేళ్లు పూర్తయింది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పడే పనులు చేస్తుండగా.. చాలా వాటిలో మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. గుత్తేదారుల కోసం అధికారుల కల్పించిన వెసులుబాటును వారు ఆదాయవనరుగా మార్చుకున్నారు. బేస్మెంట్ స్థాయికి వచ్చే సరికి నిర్మాణ వ్యయంలో దాదాపు రూ.70వేలు కాంట్రాక్టర్కు చేరుతుంది. దీంతో అక్కడి నుంచి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రారంభించిన వాటిలో 10,768 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో నిలిచిపోయాయి. మిగిలిన వాటిలో 376 మాత్రమే రూఫ్ పూర్తి చేసుకోవడం గమనార్హం. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారులు పట్టింపులేనితనం కారణంగా నెలల తరబడి పనులు నిలిచిపోవడంతో నాణ్యత దెబ్బతింటోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి నుంచి ఊపందుకుంటాయ్..
- నాగరాజు, పీడీ, గృహ నిర్మాణశాఖ
లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గుత్తేదారులు ఎంత వరకు కట్టారో.. అంత వరకే చెల్లిస్తున్నాం. ఎక్కడా రాజీపడేది లేదు. ప్రస్తుతం పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వం డిసెంబరు 22 నాటికి ఇచ్చిన లక్ష్యం చేరుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు