కొత్త మెనూ.. పాత రుచులు!
ఆలస్యంగా వడ్డించడం.. కూరలు రుచించకపోవడం.. సగానికి సగం మంది ఇళ్లకు వెళ్లితినడం.. కొందరు తినలేక పారవేయడం.. ఇవీ జగనన్న గోరుముద్ద అమలులో కనిపిస్తున్న లోపాలు.
మింగుడు పడని జగనన్న గోరుముద్ద
‘న్యూస్టుడే’ పరిశీలనలో భిన్నాభిప్రాయాలు
న్యూస్టుడే నెల్లూరు (విద్య)
ఆలస్యంగా వడ్డించడం.. కూరలు రుచించకపోవడం.. సగానికి సగం మంది ఇళ్లకు వెళ్లితినడం.. కొందరు తినలేక పారవేయడం.. ఇవీ జగనన్న గోరుముద్ద అమలులో కనిపిస్తున్న లోపాలు. వారం కిందట మారిన మధ్యాహ్న భోజన మెనూ ఇంకా రుచించడం లేదు. వడ్డిస్తున్న వంటకాలు కంటికి ఇంపుగా కనిపించడం తప్ప.. నోటికి మింగుడు పడటంలేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. భోజన పథకంలో మార్పులు చేసి ఈనెల 21 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనంపై ‘న్యూస్టుడే’ బృందం సోమవారం పరిశీలించగా.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
57 శాతం మంది ఇంటికి
పులావ్పై భాగంలో కొత్తిమీర, పుదీనా వేసిన దృశ్యం
సంగం : సంగం జడ్పీ ఉన్నత పాఠశాలలో 367 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో కేవలం 158 మంది (43 శాతం) మాత్రమే భోజనం తిన్నారు. 57 శాతం మంది ఇళ్లకు వెళ్లారు. వారు ఒక కోడిగుడ్డు, చిక్కీని తీసుకెళ్లారు. భోజనంలో కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర వడ్డించారు. పులావ్లో కూరగాయలు నామమాత్రంగా కనిపించాయి. ఆ లోపం కనిపించకుండా కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి ఉంచారు. ఇక్కడ నలుగురు పనిచేయాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. దాంతో కోడిగుడ్లను విద్యార్థులతో శుభ్రం చేయించారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో ఆహార పదార్థాల తయారీ ఆలస్యమవుతోంది. ఈక్రమంలో నాణ్యత దెబ్బతింటోంది. భోజనం తయారీ, విద్యార్థులకు వడ్డించే ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు డి.మాల్యాద్రిని వివరణ కోరగా ఎలాంటి లోపాలు లేకుండా భోజనం అందిస్తున్నామన్నారు.
కోడిగుడ్లను వలుస్తున్న విద్యార్థులు
కావలిలో అంతంత మాత్రం
కావలి : కావలి పట్టణంలోని కచ్చేరిమిట్ట, క్రిస్టియన్పేట పురపాలక ప్రాథమిక పాఠశాలల్లో మెనూ ప్రకారమే వడ్డిస్తున్నా నాణ్యత లేకుండా ఉంది. చిక్కీలు అందరికీ అందించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు, జీతాలు ఆరు నెలలుగా అందకపోవడంతో పరిశీలనకు వస్తున్న సచివాలయ సిబ్బంది సైతం లోపాలను గుర్తించినా మానవతా దృక్పథంతో మిన్నకుంటున్నారు. ః కచ్చేరిమిట్ట పాఠశాలలో మొత్తం 24 మంది విద్యార్థుల్లో ఒకరు తినలేదు. మరో ముగ్గురు ఇంటికి వెళ్లిపోయారు. పాఠశాలలో తిన్నవారిలో చాలా మంది కొంత తిని మిగతాది పారవేశారు. ః క్రిస్టియన్పేట పాఠశాలలో 29 మంది చిన్నారులకు అయిదుగురు హాజరు కాలేదు. పప్పొంగలిలో పెసరపప్పు కనిపించలేదు. కోగుడ్డు కర్రీ పలుచగా ఉంది. 20 నిమిషాలు ఆలస్యంగా వడ్డించారు.
కోవూరులో 66 మందికి ఇళ్లకు..
కోవూరు : కోవూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నరసింహమూర్తి భోజనాన్ని రుచి చూసి విద్యార్థినులకు వడ్డించారు. ఇక్కడ 858 మంది ఉండగా సోమవారం 591 మంది హాజరయ్యారు. వీరిలో 525 మంది బాలికలు అన్నం తినగా.. మిగతా 66 మంది ఇళ్లకు వెళ్లారు. వీరికి కోడిగుడ్డు, చిక్కీని అందించారు.
దగదర్తిలో 100 మంది తినలేదు
దగదర్తి : మండలంలోని దగదర్తి, కట్టుబడిపాళెం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించారు. కట్టుబడిపాళెం ఉన్నత పాఠశాలలో పూర్తిస్థాయిలో 229 మంది విద్యార్థులు భోజనం చేయగా.. దగదర్తిలో మాత్రం 289 మందికి 189 మంది పాఠశాలలో భోజనం చేశారు. మిగతా 100 మంది ఇళ్లకు వెళ్లి తిన్నారు.
మెనూ అమలుకు చర్యలు
సుబ్బారావు, ఇన్ఛార్జి డీఈవో
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకే ప్రభుత్వం మెనూ మార్చింది. కొత్తది పక్కాగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై పర్యవేక్షణ చేయిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం