కలల సాగులో కడగండ్లు
సుమారు 105 కి.మీ... 70వేల ఎకరాలు.. ఈ ఏడాది ఉత్తర కాలువ ద్వారా సాగునీరందించే ప్రతిపాదనలివి. నాణేనికి ఇది ఓ వైపు మాత్రమే. మరోవైపు.. దశాబ్దాలుగా ఉత్తర కాలువ జలాలకు ఎదురుచూసే రైతులు ఉన్నారు.
ఆత్మకూరు, ఎ.ఎస్.పేట, న్యూస్టుడే
సుమారు 105 కి.మీ... 70వేల ఎకరాలు.. ఈ ఏడాది ఉత్తర కాలువ ద్వారా సాగునీరందించే ప్రతిపాదనలివి. నాణేనికి ఇది ఓ వైపు మాత్రమే. మరోవైపు.. దశాబ్దాలుగా ఉత్తర కాలువ జలాలకు ఎదురుచూసే రైతులు ఉన్నారు. మా పెద్దలు ఈ ప్రయోజనాలు పొందకుండానే పరమపదించారు. మా తరంలో అయినా చూస్తామో.. లేదో అన్న ఆవేదన.. నిట్టూర్పు వారి నుంచి వ్యక్తమవుతోంది. వీరి మొరను అధికారులు ఆలకించాల్సిన అవసరం ఉంది.
ఆత్మకూరు మండలం బోయిళ్లచిరువెళ్ల నుంచి నెల్లూరుపాళెం వరకు ఉన్న గ్రామాలకు ఉత్తర కాలువ జలాలు అందడం లేదు. ఏడు గ్రామాల రైతులు ఈ నీటికి రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అయినా.. అటవీ అనుమతులు లేక.. అసంపూర్తి పనులతో కాలువ సేవలు అందుబాటులోకి రావడం లేదు. గండ్లవీడు చెరువు పరిధిలోని రైతులు సైతం ఉత్తర కాలువపై ఎత్తిపోతల కోసం దశాబ్దాలుగా పోరాడి అలసిపోయారు. ఇక అనుమసముద్రంపేట మండలంలో మరో తీరు. చౌటభీమవరం వద్ద ఈ కాలువ పక్కనే చెరువు ఉన్నా.. నీటి పంపిణీ లేదు. చెరువు ఎత్తులో ఉండటంతో ఎత్తిపోతల ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ ఊసే లేదు. వర్షం నీటిపైనే అధికంగా ఆధారపడే పరిస్థితి ఆయకట్టు రైతులది. శ్రీకొలను ఉప కాలువ హసనాపురం తర్వాత కొంత అసంపూర్తిగా ఉంది. దాంతో చెరువు అలుగు కాంక్రీట్వాల్ పగలగొట్టి చెరువు నీరు వెళ్లేలా చేశారు. దాంతో శ్రీకొలను వాసులు ఉత్తర కాలువ జలాల కోసం హసనాపురం చెరువు నిండే వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు మదారాబాద్ చెరువుకు నీటిని తరలించే కాలువ పనులు మధ్యలోనే ఆగాయి. దాంతో ఎప్పటికి ఈ చెరువుకు నీరు అందుతుందో తెలియని స్థితి. ఇలా ఉత్తర కాలువ జలాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
హామీలు ఇస్తూనే ఉన్నారు..
- చీమల మాలకొండయ్య
నాయకులు హామీలు ఇస్తూనే ఉన్నారు. చెరువుకు ఉత్తర కాలువ జలాలు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నాం. మా చెరువుకు నీటిని అందించే ఉప కాలువ పనులు మధ్యలోనే ఆగాయి. సోమశిల జలాలు ఎప్పటికి అందుతాయో.. ఏమో!
70 వేల ఎకరాలకు...
- వెంకట రమణారెడ్డి, ఈఈ సోమశిల ఉత్తర కాలువ డివిజన్
ఈ ఏడాది ఉత్తర కాలువ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నాం. అటవీ అనుమతులు, భూసేకరణ సమస్యలతో 42ఆర్ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించలేకున్నాం. మదారాబాద్ ఉపకాలువ అసంపూర్తిగా ఉంది. శ్రీకొలను చెరువు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు