కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభం
కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభం కాబోతోందని.. జగన్రెడ్డి ప్రభుత్వ అరాచకాలతో ఇదేం ఖర్మ అని రాష్ట్రంలోని ప్రజలందరూ తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి
మాట్లాడుతున్న మాజీ మంత్రి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
చిత్రంలో బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ తదితరులు
నెల్లూరు(స్టోన్హౌస్పేట), న్యూస్టుడే: కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభం కాబోతోందని.. జగన్రెడ్డి ప్రభుత్వ అరాచకాలతో ఇదేం ఖర్మ అని రాష్ట్రంలోని ప్రజలందరూ తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తెల్లవారి నుంచే రాష్ట్రంలో అవినీతి, అరాచకం, దోపిడీ, కక్ష సాధింపు చర్యలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు విద్యుత్తు ఛార్జీలు యూనిట్ రూ. 1.50కే ఇస్తామని చెప్పిన జగన్రెడ్డి.. జోన్ల పేరుతో రైతుల నడ్డి విరగొట్టారన్నారు. సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని.. ఏట్లో దొరికే ఇసుక నుంచి పెట్రోల్ వరకు అన్నింటిలోనూ బాదుడే బాదుడు అన్నారు. వెంకటాచలం మండల కేంద్రంలోని సీతమ్మ చలివేంద్రం భూములపై కాకాణి అనుచరుల కన్ను పడిందని.. కనుపూరు కాలువలో అవినీతి ఊట పారుతోందని ఆరోపించారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇరిగేషన్పరంగా రూ.70 కోట్ల అవినీతి జరిగిందని.. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా మంత్రికి భయపడి అధికారులు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. ఇదేం ఖర్మ పేరుతో చేపట్టిన కార్యక్రమం ద్వారా తెదేపా శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలపై చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నాయకులు పనబాక కృష్ణయ్య, తాళ్లపాక అనూరాధ, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగురు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా మందుచూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..