ఈవీగోఅన్నా రావట్లే
సులభ వాయిదాల్లో విద్యుత్తు వాహనాలు అందించాలన్న ఈవీ ప్రాజెక్టుకు ఉద్యోగుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
సులభ వాయిదాల్లో విద్యుత్తు వాహనాలు అందించాలన్న ఈవీ ప్రాజెక్టుకు ఉద్యోగుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. యాప్ అందుబాటులోకి వచ్చి.. వారాలు గడుస్తున్నా ఇప్పటికి 14 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
నెల్లూరు(స్టోన్హౌస్పేట), న్యూస్టుడే
కాలుష్య నియంత్రణ.. పర్యావరణ పరిరక్షణ.. పెట్రో భారం తగ్గింపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో వాటిని అందించేందుకు ప్రణాళిక చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నెడ్క్యాప్ ఆధ్వర్యంలో ఈవీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. జిల్లాలోనూ ఏడు సంస్థలకు సంబంధించిన 17 రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చారు. 38 వాయిదాల పద్ధతిలో రకాన్ని బట్టి రూ. 4329 నుంచి రూ.2321 వరకు చెల్లించేవి ఉన్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో ఉద్యోగులు విద్యుత్తు ఛార్జింగ్తో నడిచే బ్యాటరీ వాహనాల కోసం నమోదు చేసుకోవచ్చు.
వచ్చింది 14 దరఖాస్తులే...
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 50వేల మంది వరకు ఉంటారు. ఈవీ ప్రాజెక్టుకు వీరంతా అర్హులే. గత నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకోవచ్చని నెడ్క్యాప్ ప్రకటించింది. సంబంధిత యాప్ గురించి ఇప్పటికే ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కానీ, రోజులు గడుస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు 14 మంది మాత్రమే చేసుకున్నారు. వారిలో ముగ్గురికి చెందిన ప్రక్రియ పూర్తయి.. త్వరలో వాహనాలు అందించనున్నారు. మోడళ్ల ఎంపిక మొదలు.. ఆ శాఖ అధికారి ఆమోదం.. బ్యాంకు రుణం మంజూరు, వాహన సంస్థ బండి ఇచ్చే వరకు అన్ని దశలు కాగిత రహితంగానే చేయాల్సి ఉందని.. ఆ క్రమంలో నమోదు తక్కువగా ఉందని అధికారులు చెబుతుండగా- ఇటీవల కాలంలో ఈవీల్లో బ్యాటరీలు పేలుతుండటం.. రాయితీలు లేకపోవడం తదితర కారణాలతో స్పందన తక్కువగా ఉంటోందన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే.. మరింత ప్రచారం, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
త్వరితంగా ఇచ్చేందుకు చర్యలు
- రామలింగయ్య, జిల్లా నెడ్క్యాప్ అధికారి
సులభ వాయిదాల్లో విద్యుత్తు వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్నారు. యాప్ ద్వారా నమోదు చేసుకునే వారికి త్వరితంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం